రేగోడ్, నవంబర్ 8: మండల కేంద్రమైన రేగోడ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లోకి భారీగా చేరికలు జరిగాయి. మండల పరిధిలోని తాటిపల్లి, పెద్దతండా గ్రామాలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ను వీడి గులాబీ గూటికి చేరారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) చేసే అభివృద్ధి పనులకు ఆకర్షితులై అందోల్ ఎమ్యెల్యే క్రాంతికిరణ్ సమక్షంలో పార్టీలో చేరామని వారు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ వర్గబేధాలు, ఏ పార్టీ అనేది లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. చేరిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంతూరి పుండరీకం, పాల్త్య రమేశ్, వడిత్య శ్రీను, పాల్త్య గోపాల్ ఉన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, వైస్ చైర్మన్ రాధాకిషన్, ప్రధాన కార్యదర్శి సుంకె రమేశ్, మాజీ అధ్యక్షుడు వినోద్, సర్ధార్ పటేల్, సీఈవో హఫీజ్, సర్పంచ్లు నర్సింహులు, తుకారాం నాయక్, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రవీందర్, వైస్ ఎంపీపీ రాములు, డైరెక్టర్ భూంరెడ్డి, ఎంపీటీసీ నర్సింహులు, టీఆర్ఎస్ అధ్యక్షుడు రాచోటి సుభాశ్, పి.నర్సింగ్ రావు, బాలయ్య, రమేశ్ నాయకులు హన్మాండ్లు, హమీద్, ధర్మానాయక్, భాస్కర్, సాయగౌడ్ తదితరులున్నారు.