మెదక్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ లోని అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముదిరాజ్ సంఘం నాయకులు ఆదివారం ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మెదక్ పట్టణాధ్యక్షుడు సున్నం నరేశ్, ప్రధాన కార్యదర్శి తలారి సంతోశ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిని సన్మానించి, వినతిపత్రం అందజేశారు. మెదక్ పట్టణంలో పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, ముదిరాజ్ సంఘం భవనానికి, గోలొండ వీధిలో గట్టమ్మ ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఫతేనగర్లోని ముదిరాజ్ సంఘానికి చెందిన అక్రమంగా నిర్మించిన డబ్బాలను తొలిగించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నట్లు గుర్తు చేశారు. రైల్వేలైన్ను మంజూరు చేశారని, మెడికల్ కళాశాల ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. ముదిరాజ్ సంఘాలకు ప్రభు త్వం ఉచితంగా చేపపిల్లలను ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నదని వివరించారు. మెదక్ పట్టణంలో పెద్దమ్మ, గట్టమ్మ ఆలయా లతోపాటు ముదిరాజ్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధు లు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ వైస్ చైర్మన్ అశోక్, కౌన్సిలర్ కిశోర్, ముదిరాజ్ సం ఘం పట్టణ కమిటీ కోశాధికారి శేఖర్, ఉపాధ్యక్షుడు ఆది సురేందర్రాజ్, సలహాదారులు చింతల రమేశ్, మేకల నాగేశ్వర్, చింతల భిక్షపతి, నాయకులు పవన్ శ్రీకరరావు, సత్త య్య, ఇప్ప నారాయణ, ఉసిరికపల్లి నాగభూషణం, టీఆర్ ఎస్వై పట్టణాధ్యక్షుడు చింతల కార్తీక్ పాల్గొన్నారు.