రామాయంపేట, ఫిబ్రవరి 21: రామాయంపేట బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా జరిగింది. సోమవారం బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, పద్యాలు, ఉపన్యాస పోటీలను నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను అం దించారు. హెచ్ఎం. సవిత మాట్లాడుతు విద్యార్థులు మన మాతృభాష అయిన తెలుగు భాషను ఎప్పటికీ మరువొద్దన్నా రు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాధిక, రత్నశ్రీ, నాగరాణి, పద్మజ, స్వరూపారాణి, రేణుక, పీఈటీ పద్మ, సత్యవతి, సౌమ్య, మమత, విజయ ఉన్నారు.
చేగుంట మండల పరిధిలో
మండల పరిధిలోని పోలంపల్లి, కర్నాల్పల్లి,చెట్ల తిమ్మాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులకు పోడుపు కథల పుస్తకాలను అందజేసి, మాతృభాష ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. పోతాన్పల్లి పాఠశాలలో నిర్వహించిన చదువు ఆనందించు అనే కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొని విద్యార్థులతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు.
నిజాంపేట మండలంలో..
మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సోమవారం నందగోకుల్ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమంలో సర్పంచ్ బాల్నర్సవ్వ మాట్లాడారు.
తూప్రాన్లో..
తూప్రాన్ గీతా హైస్కూల్లో మాతృభాషా దినోత్సవ వేడుకలను ఘనం గా నిర్వహించారు. మాతృభాష గొప్పదనాన్ని చాటే విధంగా సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గీతా విద్యా సం స్థల కరస్పాండెంట్ రామాంజనేయులు, డైరెక్టర్ ఉష, ప్రిన్సిపల్ వెంకట కృష్ణారావు, ఇన్చార్జి ప్రినిపాల్ ప్రేమ్రాజ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్తో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కూచన్పల్లి జడ్పీహెచ్ఎస్లో
అంతర్జాతీయ భాషా దినోత్సవాన్ని కూచన్పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో హెచ్ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యాబోధనకు మాతృభాష జాతి, వారసత్వ సంపదకు ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, గేయాల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎల్లయ్య, మాధవి, విజయ్కుమార్, మల్లారెడ్డి, చంద్రకాంత్, నసీర్ తదితరులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.