మెదక్ అర్బన్, అక్టోబర్ 13 : దూరప్రాంత ప్రయాణికుల సౌలభ్యం కోసం టీఎస్ఆర్టీసీ ఐ-టిమ్స్ ద్వారా టికెటింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టామని మెదక్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుదర్శన్ అన్నారు. గురువారం సంగారెడ్డి – తిరుపతి బస్సు లో ప్రయాణికులతోపాటు ప్రయాణించి టెక్నాలజీపై అవగా హన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నగదు రహిత లావాదేవీలతో ప్రయాణికులు, డ్రైవర్లకు చిల్లర సమస్య ఉండన్నారు. ఐ-టిమ్స్ టిక్కెటింగ్ ద్వారా ప్రయాణి కులకు టికెట్ జారీ చేస్తామని తెలిపారు. నగదు రహిత లావా దేవీలను ప్రోత్సహించడానికి ఐ-టిమ్స్ ప్రవేశపెట్టినట్లు తెలి పారు. ప్రయాణికులు ఫోన్ పే, గూగుల్ పే, క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా నగదు చెల్లించవచ్చన్నారు. గతంలో ఓపీఆర్ఎస్ సర్వీస్ బస్సులు బయలుదేరే సమయానికి గంట ముందు రిజర్వేషన్ సౌకర్యం ఉండేదని, ఇప్పుడు బస్సు వెళ్లడానికి 15 నిమిషాల ముందు కూడా ప్రయాణికులు ఓపీఆర్ ద్వారా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చని వివరించారు. అప్పటికప్పుడు రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.
ఐ-టిమ్లో డేటా ఎప్పటికప్పుడు అప్డెట్ అవుతుందన్నా రు. ముందు బస్టాప్లో టికెట్ తీసుకుంటే బస్సులో ఉన్న ఐ-టిమ్లో అప్డెట్ అవుతుందన్నారు. డ్రైవర్లు ఆ సీటును వేరే వాళ్లకు ఇవ్వకుండా జాగ్రత్త పడతారన్నారు. ఐ-టిమ్ టెక్నాల జీని నారాయణఖేడ్ డిపో బస్సుల్లో ప్రవేశపెట్టామన్నారు. వీటిలో నారాయణఖేడ్ – చీరాల, నారాయణఖేడ్-కందుకూ రు సూపర్ లగ్జరీ బస్సుల్లో వినియోగిస్తారు. సంగారెడ్డి డిపో లో సంగారెడ్డి-విశాఖపట్నం రాజధాని బస్సు, సంగారెడ్డి-తిరుపతి, సంగారెడ్డి-అమలాపురం, సంగారెడ్డి-కర్నూల్ సూ పర్ లగ్జరీ బస్సులో వినియోగిస్తారు. మెదక్ డిపోలో మెదక్-తిరుపతి, జహిరాబాద్ డిపోలో జహీరాబాద్-బెంగుళూరు, జహీరాబాద్-నెల్లూరు, జహీరాబాద్-కందుకూర్ సూపర్ లగ్జరీ బస్సుల్లో మాత్రమే వినియోగిస్తున్నట్లు తెలిపారు.