మెదక్ అర్బన్, అక్టోబర్13 : చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులను సంబంధిత అధికారులు త్వరగా పూ ర్తి చేయాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ కేసులు పెండిగ్లో గల ముఖ్య కారణాలను తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల్లో గ్రేవ్, నాన్గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, మెడికల్ సర్టిఫికెట్ త్వరగా తెప్పించి కేసులను పరిష్కరించాలని సూచించారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రమా ద నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.
చట్టంపై అవగాహన కల్పించాలని ప్రతి పోలీస్ అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, ప్రత్యేక ప్రణాళికతో పెండింగ్ కేసుల ను తగ్గించాలన్నారు. బ్లూకోల్ట్స్, పెట్రో మొబైల్ అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఫొక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో పూర్తి సాక్ష్యాలతో దర్యాప్తును చేసి నేరస్తులకు శిక్షలు పడే విధంగా చూడాలని, రిసెప్షన్, ఎస్హెచ్ఓ, కమ్యూనిటీ పోలీసింగ్ ఇలా పోలీస్ స్టేషన్కి సంబంధించిన అన్ని విభాగాల ఫంక్షనల్ వర్టీకల్స్ గురించి తెలుసుకుని స్టేషన్లోని వివిధ వర్టికల్స్లో సిబ్బంది పోటీతత్వంతో పనిచేసే మెరుగైన అభివృద్ధి సాధించాలని తెలిపారు. కార్యక్రమలో జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి, మెదక్ డీఎస్పీ సైదులు, తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
కేసుల దర్యాప్తులో అలసత్వం చూపకుండా సత్వరం పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, మైనర్ బాలికలపై జరుగుతున్న శారీరక, మానసిక దాడులపై కఠినంగా వ్యవహరించాలని, ఇందుకు కారణమైన దోషులకు శిక్షపడేలా చూడాలన్నా రు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక షీ-టీం బృందాలను సబ్ -డివిజన్ల వారీగా ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చొరవ చూపాలని, తమ ఏరియాలో బ్లాక్ స్పార్ట్లను గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూ చించారు. ప్రధాన కూడళ్లు, హైవేలపై సీసీ కెమెరాల ఏర్పా టు, త్రిబుల్ రైడింగ్, హెల్మెట్, రాంగ్ రూట్ వంటి నింబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధించాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆన్లైన్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ఆన్లైన్లో ఎలాంటి లోన్యాప్లు డౌన్లోడ్ చేసుకొవద్దని, ఏ బ్యాంకులు ఓటీపీలు అడగవని, ఓటీపీలు షేర్ చేసి ఇబ్బందులకు గురికావద్దన్నారు. ఆన్లైన్ లో అపరిచిత వ్యక్తుల పరిచయాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 డయల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. గంజాయి సాగు లేదా సరఫరా చేయడం, సారాయి కాయడం, అమ్మడం, గుట్కా లు వాటిని నిషేదించడం జరిగిందని, ఈ చర్యలకు పాల్పడిన వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలని ఆదేశించారు. నేరాలకు సంబంధించిన వ్యక్తుల వివరాలను ఎప్పటికప్పుడు సం బంధిత సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. పెండింగ్ వారెంట్స్, సమన్స్ విషయంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్క లు నాటాలన్నారు. సిబ్బంది ఎవరైనా చట్ట వ్యతిరేకతకు పాల్పడితే సహించేది లేదని, శాఖపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఉప విశ్వనాథ్, సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ డీఎస్పీలు రవీంద్రరెడ్డి, భీంరెడ్డి, రఘు, బాలాజీ, ఎస్బి ఇన్ స్పెక్టర్ మహేశ్గౌడ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ జలేందర్రెడ్డి, మహిళా పీఎస్ ఇన్స్పెక్టర్ ఉమారాణి, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.