బొల్లారం, అక్టోబర్ 13 : ఓ యువకుడు అతి దారుణంగా హత్యకు గురైన ఘటన ఐడీఏ బొల్లారం పోలీస్స్టేషన్ పరిధి లో సంచలనం రేపింది. బొల్లారం సీఐ సురేందర్రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని దేవతల గుట్ట వద్ద సర్వీస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున రక్తపుమడుగులో పడి ఉన్న ఓ యువకుడి మృతదేహన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న సీఐ సురేందర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన యువకుడు చామన ఛాయ రంగు లో ఉన్నట్లు, బ్లాక్ టీషర్ట్, జెఎన్ఎస్ పేరుగల జీన్స్, మెడలో రుద్రాక్షమాల ధరించినట్లు పోలీసులు తెలిపారు. యువకుడికి దా దాపు 22సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. నోట్లో గుడ్డ కుక్కి, మెడకు వైట్ క్లాత్ బిగించి, తలపై గట్టిగా బాధి చంపి ఉండొచ్చుననే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.
యువకుడు రక్తపుమడుగులో హత్యకు గురై ప్రదేశాన్ని డా గ్ స్వాడ్, క్లూస్టీం బృందం సభ్యులు పరిశీలించారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన శునకాలు దేవతల గుట్టపై వరకు వెళ్లి నిందితుల ఆచూకీని గాలించాయి. కానీ అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు.
యువకుడిని హత్య చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుని కేసు ఛేదిస్తామని సీఐ సురేందర్రెడ్డి తెలిపారు. అన్ని కో ణాల్లో సంపూర్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృత దేహాన్ని పంచనామా నిర్వహించి పటాన్చెరు ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టంకు తరలించినట్లు తెలిపారు.