తొగుట, ఫిబ్రవరి 20: రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్తప్రభాకర్రెడ్డి అన్నారు. తొగుట మార్కెట్ అభివృద్ధికి మంత్రి తన్నీరు హరీశ్రావు సహకారంతో రూ.40 లక్షలు మంజూరు చేయించి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గడీల అనితా లక్ష్మారెడ్డికి ఆదివారం ఆయన ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని గుర్తుచేశారు.
తక్కువ కాలంలో మల్లన్నసాగర్ పూర్తిచేసిన ఘనత టీఆర్ఎస్దే
దేశంలోనే తక్కువ కాలంలో మల్లన్నసాగర్ నిర్మాణం పూర్తిచేసిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఈ నెల 23న మల్లన్నసాగర్ను సీఎం కేసీఆర్ ప్రారంభం చేయనున్నారు.ఆదివారం మల్లన్నసాగర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ నిర్మాణం చేసేటప్పుడు ప్రతిపక్షాలు హేళనచేశాయన్నారు. పట్టుదలతో సీఎం కేసీఆర్ మల్లన్నసాగర్ నిర్మాణం పూర్తి చేసి ప్రతిపక్షాల కండ్లు తెరిపించారన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జిడిపల్లి రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ హరికృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కనకయ్య, సర్పంచ్లు గోవర్ధన్రెడ్డి, ఎల్లం, ఎంపీటీసీ స్వామి, కో- ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీమొద్దీన్,వైస్ చైర్మన్ పోచయ్య, నాయకులు సుతారి రమేశ్, శ్రీనివాస్రెడ్డి, మంగ నర్సింహులు, సురేశ్గౌడ్, రమేశ్, యాదగిరి పాల్గొన్నారు.