దేశ ప్రగతి కోసం, జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టేందుకు ముందడుగు వేశారు ముఖ్య మంత్రి కేసీఆర్. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అన్నిరంగాల్లో అగ్ర పథాన నడుపుతున్నారని సబ్బండ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశాన్ని సైతం ప్రగతిపథంలో నడిపే దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని విస్తరించి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చడంతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. దేశంలో విజన్ ఉన్న నాయకుల్లో సీఎం కేసీఆర్ ఒకరు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు భవిష్యత్లో దేశప్రజలందరికీ చేరుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నిరంకుశ పాలనను పారదోలే సత్తా ఉన్న నాయకుడని పేర్కొంటున్నారు.. అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉండాలంటే కేసీఆర్తోనే సాధ్యమని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్: తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు అవసరం. అందుకు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్పార్టీని స్వాగతిస్తున్నారు. దేశంలో విజన్ ఉన్న నాయకుల్లో ఒకరు. కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. అసంఘటిత కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అవగాహన ఉన్న కేసీఆర్ ప్రధాని అయితే ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొస్తారు. మహారాష్ట్ర రైతులు తమ ప్రాంతాలను తెలంగాణలో విలీనం చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. గడిచిన ఎనిమిదేండ్లలోనే రాష్ర్టాన్ని దేశంలో మాడల్గా తీర్చిదిద్దారు. దేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయం. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఇతర రాష్ర్టాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రధాని అయితే తెలంగాణలో మరిన్ని ప్రాజెక్టులు వచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సాగునీటి రంగం, ప్రాజెక్టుల నిర్మాణంలో పూర్తి అవగాహన ఉంది.
దేశప్రజలు మెచ్చిన నేత సీఎం కేసీఆర్
దేశప్రజలు మెచ్చిన నేత మన సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను సమర్థవంతంగా అమలు చేస్తూ విజయం సాధించారు. మన రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, కల్యాణలక్ష్మిలాంటి సంక్షేమ పథకాలు జాతీయ స్థాయిలో అమలు చేయాలంటే కేసీఆర్ సార్ ప్రధానమంత్రి కావాలి. దక్షిణభారతం నుంచి జాతీయ రాజకీయాల్లోకి వస్తున్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. సీఎం కేసీఆర్ విజయం సాధిస్తారని అందరం విశ్వసిస్తున్నాం.
-కొత్తపల్లి ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా యువనేత, గుమ్మడిదల మండలం
బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారు..
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు అవసరం. అందుకు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్పార్టీని స్వాగతిస్తున్నారు. తెలంగాణలో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతుబీమా, రైతుబంధు, రాయితీపై పరికరాల పంపిణీని చూసి మహారాష్ట్ర రైతులు తమ ప్రాంతాలను తెలంగాణలో విలీనం చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇలా చాలా ప్రాంతాల ప్రజలు సీఎం కేసీఆర్ పాలనను అభినందిస్తున్నారు. దేశంలో మార్పు రావాలంటే అది తెలంగాణ సీఎం కేసీఆర్తోనే సాధ్యం. గడిచిన ఎనిమిదేండ్లలోనే తెలంగాణను దేశంలో మాడల్గా తీర్చిదిద్దారు. తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కేంద్ర మంత్రులే అభినందించారు. నేడు రాష్ర్టానికి అవార్డులు వస్తున్నాయంటే అది సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులే. దేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయం. కేసీఆర్ ఏది చేసినా తప్పకుండా ప్రజలకు న్యాయం చేసే దిశగా ఉంటుంది, అది తప్పకుండా విజయం సాధిస్తుంది.
– అల్వాల బాలేష్, మున్సిపల్ కౌన్సిలర్, గజ్వేల్
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే..
సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని అయితే తెలంగాణ బిడ్డ కాబట్టి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే ఆస్కారం, అవకాశం ఆయన చేతుల్లో ఉంటుంది. ఇంతకు ముందు తక్కువ నిధులు వచ్చినప్పటికీ ప్రత్యేక దృష్టితో ఎక్కువ నిధులు ఇచ్చే అవకాశం లభిస్తుంది. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ఖాయం. దేశంలో ప్రస్తుత నాయకుల్లో ధైర్యవంతుడు కేసీఆర్ ఒక్కడే. ఇక్కడ జరుగుతున్న పనులను చూసి ఇతర రాష్ర్టాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులు బాగున్నాయని పొగుడుతున్నారు. ఈ ప్రాంతం నుంచి దేశ ప్రధాని అయ్యే అవకాశం సీఎం కేసీఆర్కు వస్తుందంటే మనమంతా గర్వపడాలి. తెలంగాణ సమాజం మద్దతు సీఎం కేసీఆర్కు ఉంది.
– పయ్యావుల ఎల్లం యాదవ్, నసారపుర, యాదవ సంఘం అధ్యక్షుడు, సిద్దిపేట
కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తి సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. అసంఘటిత కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అవగాహన ఉన్న కేసీఆర్ ప్రధాని అయితే సంస్కరణలు తీసుకొస్తారు. తెలంగాణను అభివృద్ధి చేసి దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిపారు. సీఎం కేసీఆర్ ప్రధాని అయితే తెలంగాణలో మరిన్ని ప్రాజెక్టులు వచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు యువతకు లభిస్తాయి. సాగునీటి రంగంపై పట్టున్న సీఎం కేసీఆర్కు ప్రాజెక్టుల నిర్మాణంలో పూర్తి అవగాహన ఉంది. బడుగు, బలహీన వర్గాల పరిస్థితులు మారాల్సిన అవసరం ఉంది. సమస్యల పరిష్కారంలో నిరంతర అన్వేషణ చేసే వ్యక్తి సీఎం కేసీఆర్. ఆయన ఆలోచన విధానాలు దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయి.
– వరుకోలు రాజలింగం, సీనియర్ న్యాయవాది, సిద్దిపేట విజన్ ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్
దేశంలో విజన్ ఉన్న వ్యక్తుల్లో సీఎం కేసీఆర్ ఒకరు. ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా తెలంగాణ తరహా పాలన కోరుకుంటున్నారు. అందరికీ మంచి చేసే నాయకులను దేశ ప్రజలు గౌరవిస్తారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలే ఇందుకు నిదర్శనం. పేదలకు ఇల్లు కట్టి ఇస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమే. రైతులు, బీడీ కార్మికులు, వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నారు. సం క్షేమం, అభివృద్ధి సమానంగా తెలంగాణలో పాలన కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ ప్రధాని అయితే దేశానికి, తెలంగాణకు మంచిజరగడం ఖాయం.
-వంకాయల వెంకటేశ్, బంగారు మైసమ్మ యూత్ అధ్యక్షుడు, సిద్దిపేట
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం..
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ తీరుతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుండ్రు. పేదలను కొట్టి పెద్దలకు పెట్టాలనే ధోరణితో మోదీ పాలన సాగుతున్నది. ధరల పెరుగుదలతో పేదల బతుకు భారమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పోరాడేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. బీఆర్ఎస్తో జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతు తెలుపాలి. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు అందించడమే బీఆర్ఎస్ లక్ష్యం.
-బూరుగడ్డ నగేశ్, జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు, ఆర్సీపురం, సంగారెడ్డి జిల్లా
రైతులు బాగుపడుతారు
బీఆర్ఎస్తో దేశంలోని రైతుల భవిష్యత్ ఉజ్వలంగా మారుతుంది. అన్నదాతను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అన్ని ప్రాంతాల్లో ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపుతాడు. బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకం విధించడంతో రైతులకు మద్దతు ధర రావడం లేదు. కేసీఆర్ ఢిల్లీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యమ శిఖరమై తెలంగాణను సాధించడంతో పాటు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిన సీఎం కేసీఆర్ రాజకీయ చరిష్మా కలిగిన నేత. రైతుల సంక్షేమం కోసం దేశానికి కేసీఆర్ సేవలు ఎంతో అవసరం.
-పైడి శ్రీధర్గుప్తా, శ్రీ పాద ట్రస్ట్ చైర్మన్, రైస్మిల్ యజమాని, నర్సాపూర్
బీఆర్ఎస్ తోనే దేశ రాజకీయాల్లో మార్పు
బీఆర్ఎస్ పార్టీ దేశంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. పోరాడి తెలంగాణను సాధించిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోనూ తప్పనిసరిగా సంచలన మార్పులు తీసుకువస్తారు.తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికి రోల్మాడల్గా నిలిచాయి. దేశ ప్రజలందరూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని గమనిస్తున్నారు. ఇలాంటి పాలన తమకూ కావాలని కోరుకుంటున్నారు. ఇది కేవలం కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుందని దేశమంతా నమ్ముతున్నది. దేశ ప్రజలకు మంచిపాలన అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారు . బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్ఎస్ పార్టీ మారుతుంది.
-సయ్యద్ ఉమర్ మొహియుద్దీన్, టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు, మెదక్
దేశ ప్రగతి సీఎం కేసీఆర్కే సాధ్యం
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని ఎలా ప్రగతి పథంలో నడిపిస్తున్నారో.. దేశాన్ని కూడా అదే బాటలో నడిపించగలరు. గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్, ప్రస్తుత బీజేపీలు ఊహించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదు. ప్రజా సమస్యలు తెలిసిన నేతగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించగలరు. చాలా రాష్ర్టాల నాయకులు, ప్రజలు బీఆర్ఎస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) కీలకంగా మారనున్నది. మిగత రాష్ర్టాల ప్రజలు కూడా అండగా నిలబడతారు.
-కుంచాల ప్రభాకర్, జడ్పీవైస్ చైర్మన్ (జిన్నారం)