పెద్దశంకరంపేట, అక్టోబర్ 7 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని మాల్కాపురం గ్రామపంచాయతీ పరిధిలోని సేవాలాల్ తండాలో రూ.45 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్టంలో అనేక సం క్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాల ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సేవాలాల్ తండాలో రూ.20 లక్షలతో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు, రూ. 20 లక్షలతో గిరిజన కమ్యూనిటీ హాల్, జడ్పీటీసీ కోటాలో రూ.4.50 లక్షలతో నిర్మిస్తున్న గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి శంకుస్థాపన చేశారు.
పెద్దశంకరంపేట/రామాయంపేట, అక్టోబర్ 7 : ఉప ఎన్ని క జరగనున్న నల్గొండ జిల్లా మునుగోడుకు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్తో కలిసి వెళ్లారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖాయమని, ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు మురళీపంతులు, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు సురేశ్గౌడ్, సర్పంచ్ లక్ష్మణ్నాయక్, నాయకులు పున్నయ్య, అమర్ పాల్గొన్నారు.
రామాయంపేట ఉమ్మడి మండలం నుంచి పెద్ద సంఖ్యలో మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి నాయకులు తరలివెళ్లారు. రామాయంపేట, నిజాంపేట మండలాల నుంచి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల, పటణాధ్యక్షులు బండారు మహేందర్రెడ్డి, సుధాకర్రెడ్డి, గజవాడ నాగరాజు, చలిమెట్టి నాగరాజు, ఎంపీపీలు దేశెట్టి సిద్దిరాములు, నార్సింపేట భిక్షపతి, రైతుబంధు అధ్యక్షులు నర్సారెడ్డి, సంపత్, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, కౌన్సిలర్లు ప్రచారానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి నాయకత్వంలో తరలివెళ్లారు.