మెదక్ రూరల్/ రామాయంపేట/ పెద్దశంకరంపేట/ అల్లాదుర్గం/ నిజాంపేట/ కొల్చారం/ చిలిపిచెడ్, అక్టోబర్ 5 : జిల్లాలో దసరా సంబురాలు అంబరాన్నంటాయి. మెదక్ మం డలంలో మంబోజిపల్లి శివారులో ఉన్న కొయ్యగుట్ట మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శమి పూజలు నిర్వహించిన అనంతరం ప్రజలు జమ్మి ఆకులను తెంపి, బం గారంగా భావించి, ఆత్మీయులకు పంచి, అలయ్..బలయ్ తీసుకున్నారు. రైతులు, శ్రామికులు ఆయుధ పూజ నిర్వహిం చారు. రైతులు వ్యవసాయ పనిముట్లతోపాటు ఎడ్ల బండ్లకు ప్ర త్యేక పూజలు నిర్వహించారు. మాచవరంలో రావణ దహనం నిర్వహించారు. రామాయంపేట పట్టణంలోని జాతీయ రహదారి వద్ద షామియానాలను ఏర్పాటు చేసి పాలపిట్టలను ప్రదర్శనగా ఉంచారు. కోనాపూర్లో గ్రామస్తులు ఉట్టి కొట్టారు. రామాయంపేటలోని పాత పోలీస్స్టేషన్ వద్ద కాషాయం జెం డాను ఆవిష్కరించారు. గిరిజనులు తం డాల్లో బోనాలతో ఊరేగింపు చేపట్టారు. పెద్దశంకరంపేట ప్రజలు రామాపురంలోని పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అల్లాదుర్గం, రెడ్డిపల్లి, గడిపెద్దాపూర్ గ్రామాల్లో మండపాల్లో ప్రతిష్ఠించిన దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అల్లాదుర్గంలో మంగళవారం రాత్రి దీపోత్సవం నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంతోపాటు నందిగామ, నస్కల్, చల్మెడ, కల్వకుంట, నగరం, నందగోకుల్ గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు. నిజాంపేటలో గాంధీ విగ్రహం వద్ద రావణ దహనం చేశారు. కొల్చారం మండలం రంగంపేటలో సర్పంచ్ సుజాతారమేశ్ ఆధ్వర్యంలో రావణ దహనం నిర్వ హించారు. చిలిపిచెడ్తోపాటు చండూర్, గౌతాపూర్, చిట్కుల్, సోమక్కపేట గ్రామాల్లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి.