రామాయంపేట, అక్టోబర్ 3: మహిషాసుర మర్ధిని అవతారంలో మహంకాళి అమ్మవారు భక్తులకు సోమవారం ద ర్శనం ఇచ్చారు. రామాయంపేట పట్టణంలోని మహంకాళీ ఆలయంలో జరుగుతున్న దుర్గాదేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని పూలతో అలంకరించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో యజ్ఞహోమాలు, మంగళహారతులు, నైవేద్యాలను ఆలయ ట్రస్ట్ చైర్మన్ పాండురంగ చారీ దంపతులు మహిళా భక్తులలో యజ్ఞహోమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులకు పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 3: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఫతేనగర్లో దుర్గామాతను సోమవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు చందనాసుమన్, ఆవారి శేకర్, సమియొద్దీన్, ఆర్కె శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, మధుసూదన్రావు, దుర్గప్రసాద్, శ్రీధర్యాదవ్, ప్రవీణ్గౌడ్, రాజు, దత్తు ఉన్నారు.
చేగుంట, అక్టోబర్ 3: దే వి శరన్నవరాత్రి ఉత్సవాలు మండలంతో పాటు పలు గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో జ రుపుతున్నారు. సోమవారం అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఇబ్రహీంపూర్లో ఏర్పాటు చేసిన దుర్గమా త అమ్మవారి వద్ద వేంకటేశ్వరస్వామి దేవాలయ ట్రస్టు చైర్మన్ గోల్కొండ కిషన్రావు దేశ్ముఖ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
నర్సాపూర్, అక్టోబర్ 3: దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని నర్సాపూర్ పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయ అశోక్గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ఒడి బియ్యం పోశారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
వెల్దుర్తి, అక్టోబర్ 3: దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం గ్రామదేవతలకు ఓడిబియ్యం సమర్పించారు. దుర్గాదేవి మహాగౌరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామ దేవాతలకు మాల ధరించిన స్వాములు పట్టువస్ర్తాలు, ఓడిబియ్యన్ని డప్పుచప్పుళ్ల నడు మ ఊరేగింపుగా తీసుకెళ్లి దేవతామూర్తులకు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.