నర్సాపూర్/ శివ్వంపేట/ కొల్చారం/ వెల్దుర్తి/ చిలిపిచెడ్, అక్టోబర్1 : తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ముందంజలో ఉన్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం నర్సాపూర్ పట్టణంలో ఎంపీడీవో కార్యాలయంలో 65 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు అన్ని పథకాల కంటే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఎంతో ఇష్టమైనదని వెల్లడించారు. కలిసిన ప్రతిసారి చెక్కుల పంపిణీ సజావు గా జరుగుతుందా? లేదా? అని ఆరా తీస్తారని గుర్తుచేశారు. క్వింటాల్ ధాన్యానికి రూ.2060 మద్దతు ధర ఇచ్చి సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ని ప్రజలందరూ దీవించాలని కోరారు. చిల్డ్రన్స్ పార్కులో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అట్ల బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నా రు. తెలంగాణ వచ్చిన తర్వాతే బతుకమ్మ పండుగకు ప్రాధా న్యం పెరిగిందన్నారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, జడ్పీటీసీ బాబ్యానాయక్, ఎంపీపీ జ్యోతి, టీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్గుప్తా, సీడీపీవో హేమబార్గవి, జిల్లా సంక్షేమాధికారి బ్రహ్మజీ, సర్పంచ్లు శివకుమార్, సేనాధిపతి, అశోక్, మదన్మోహన్, సామ్యానాయక్, ఊమ్లా పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు దేశానికే ఆదర్శం
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. శివ్వంపేట తహసీల్ కార్యాలయం ఆవరణలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు అని అన్నారు. ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని, ఎవరూ అధైర్యపడ వద్దన్నారు. శివ్వంపేట మండలంలోని 315, 316 సర్వేనెంబర్లలోని భూముల విషయంలో అసలైన లబ్ధ్దిదారులను గుర్తించామని, వారికి త్వరలోనే మంత్రి హరీశ్రావు, కలెక్టర్ చేతులమీదుగా పట్టాపాస్పుస్తకాలు అందజేస్తారని తెలిపారు.
రిజర్వేషన్ల పెంపుపై గిరిజనుల సంబురాలు
ఇచ్చిన మాటకు కట్టుబడడం సీఎం కేసీఆర్కే సాధ్యమని శివ్వంపేట మండలంలోని గిరిజనులు అన్నారు. 10శాతం రిజ ర్వేషన్లు పెంచుతూ జీవో విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీపీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే సమక్షంలో క్షీరాభిషేకం చేశారు.
వీఆర్ఏలు దీక్షలు విరమించాలి..
శివ్వంపేటలో దీక్ష చేస్తున్న వీఆర్ఏల వద్దకు ఎమ్మెల్యే వెళ్లి వారితో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ తప్పకుండా అమలుచేస్తారని, దీక్షలు ఉపసంహరించుకొని విధులకు హాజరుకావాలని సూచించారు. సీఎం కేసీఆర్.. మనం అడగకముం దే అన్నీ ఇచ్చే గొప్ప నాయకుడు అన్నారు. ఆయా కార్యక్రమా ల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీలు కల్లూరి హరికృష్ణ, స్వరూపానరేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్చారి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, ఎంపీటీసీలు సత్తిరెడ్డి, గోవింద్నాయక్, నువ్వుల దశరథ, సర్పంచ్లు పత్రాల శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్యాదవ్, బాబూరావు, గిరిజన నాయకులు రవినాయక్, కిషన్నాయక్, చెన్నానాయక్, రాజూనాయక్, హర్జానాయక్ పాల్గొన్నారు.
గడప గడపకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు
కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో 55 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎంపీపీ మంజులాకాశీనాథ్, తహసీల్దార్ చంద్రశేఖర్రావుతో కలిసి పం పిణీ చేశారు. టీఆర్ఎస్ హయాంలోనే ఇంటింటికీ సంక్షేమ పథకాలు చేరుతున్నట్లు ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీశంకర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్లు వీరారెడ్డి, ఇందిరాప్రియదర్శిని, ఉమారాజాగౌడ్, ఝాన్సీలక్ష్మీయాదగిరి, గౌడ సంఘం మండలాధ్యక్షుడు వెంకట్గౌడ్, ఆత్మ కమిటీ వైస్చైర్మన్ శేఖర్, ఆర్ఐ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణతల్లి, దొడ్డి కొమురయ్య విగ్రహాల ఆవిష్కరణ
వెల్దురి పంచాయతీలోని శేరీ గ్రామంలో దొడ్డి కొమురయ్య, యశ్వంతరావుపేటలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ తల్లితోపాటు మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని, వారి స్ఫూర్తిని, పోరాట పటిమను కొనసాగించాలని పిలుపుని చ్చారు. దొడ్డి కొమురయ్య పోరాటాన్ని భావితరాలకు తెలిసేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. యశ్వంతరావుపేటలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రమేశ్గౌడ్, సర్పంచ్ భాగ్యమ్మ, ఎంపీటీసీ మోహన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి, నాయకులు ఆంజనేయులు, నరేందర్రెడ్డి, రాజాగౌడ్ పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం..
చిలిపిచెడ్ మండలం అజ్జమర్రికి చెందిన ఎల్లయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల ప్రమాదబీమా చెక్కును నర్సాపూర్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి, సర్పంచ్ పరశురాంరెడ్డి అందజేశారు. కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని, కష్టపడి పనిచేసే వారికి పార్టీలో తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు.