జగదేవ్పూర్, సెప్టెంబర్ 29 : ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడిపించే ప్రైవేటు దవాఖానలపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీధర్ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని పలు ప్రైవేటు దవాఖానలకు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనుమతి లేని దవాఖానలకు ఫైన్ విధించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గంలో 28 దవాఖానలను తనిఖీ చేయగా, 13 దవాఖానలకు ఫైన్ విధించామన్నారు. 12 దవాఖానలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. పద్మసాయి దవాఖానను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీహెచ్వో రవీందర్రెడ్డి, మెడికల్ ఆఫీసర్ మహేశ్కుమార్ తదితరులు ఉన్నారు.