నర్సాపూర్, సెప్టెంబర్ 22 : పోషకాహారలోపాన్ని నివా రించి, ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నర్సాపూర్ మండల పరిధిలోని కాగజ్మద్దూర్, మూసాపేట్ గ్రామాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార మా సోత్సవాలు నిర్వహించారు. ఉత్సవాలకు మహిళా కమిషన్ చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, పిల్లలు పౌష్టికాహారంతీసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు. నర్సాపూర్ నియోజక వర్గంలోని 14 గ్రామాల్లో పౌష్టికాహారం లోపంతో పిల్లలు బాధపడుతున్నట్లు గుర్తించారని తెలిపారు. బాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, ఐసీడీఎస్ అందజేసే మందులతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు.
మాతా, శిశు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్య త ఇస్తున్నదని అన్నారు. ఇందులో భాగం గా మహిళలకు పౌష్టికాహారాన్ని అం దించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్ర భుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో న్యూ ట్రీగార్డెన్స్ ఏర్పాటు చేయడం అభి నందనీయమన్నారు. నవజాత శిశువు ను వెయ్యిరోజుల వరకు జాగ్రత్తగా చూ సుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అప్పుడే పుట్టిన శిశువులకు గంటలోపు ముర్రుపాలు పట్టిస్తే రోగ నిరోధకశక్తి పెరుగుతుందన్నారు. కిశోర బాలికల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చిన చిన్నారులు వయస్సుకు తగ్గ బరువు ఎత్తులేరని అసంతృప్తి వ్యక్తం చేశా రు. అనంతరం ఐసీఐడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతాలు నిర్వహించా రు. కార్యక్రమంలో సీడీపీవో హేమాభార్గవి, సర్పంచ్ శివకుమార్, ఎంపీటీసీ గాయత్రి, మాజీ ఎంపీటీసీ చం ద్రశేఖర్, అంగన్వాడీ సూపర్వైజర్ సరళకుమారి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొ ద్దీన్, మాజీ ఎంపీపీ లలిత, నాయకులు సుధాకర్రెడ్డి, సత్యంగౌడ్, వెం కట్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
రామాయంపేట, సెప్టెంబర్ 22 : బాలింతలు, గర్భిణులు, చిన్నారులు పోషకాహారాన్ని తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్, ఎస్సై రాజేశ్, సీడీపీవో స్వరూపారాణి అన్నారు. రామాయంపేటలోని వివేకానంద ఆవాస విద్యాలయంలో పోషణ్ మహోత్సవ సంబు రాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న బాలామృతాన్ని పిల్లలకు అందించాలన్నారు. చిన్నారులకు అందజేసే బాలామృతాన్ని పక్కదారి పట్టించేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టు పరిధిలోని అన్ని మండలాలకు పౌష్టికాహార పదార్థాలను అందజేస్తున్నామని సీడీపీవో స్వరూపారాణి వివరించారు. పిల్లలకు బలయమైన ఆహారం బాలామృతమేనన్నారు. ఎంపీడీవో ఉమాదేవి మాట్లాడుతూ 2018 నుంచి పోషణ్ అభియాన్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎండీ మన్నన్, వైద్యులు ఎలిబెత్రాణి, సత్తమ్మ, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్లు, మహిళలు పాల్గొన్నారు.
– హాజరైన మున్సిపల్ చైర్మన్, సీడీపీవో