కంగ్టి, ఫిబ్రవరి 13: గ్రామాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం దామరిగిద్ద, బాన్సువాడ, తడ్కల్, చాప్టా(కె), కంగ్టిలో సీసీ రోడ్లకు భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం పల్లెప్రగతి తదితర పథకాలను ప్రారంభించిందన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని, ప్రతిరోజు తమ ఇంటివద్దకే తడి, పొడి చెత్త వాహనం వస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీపీ సంగీతావెంకట్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కోట ఆంజనేయులు, కంగ్టి ఇన్చార్జి సర్పంచ్ నర్సమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగారాం, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లన్నీ సీసీ రోడ్లుగా మార్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఆదివారం నాగన్పల్లి గ్రామంలో ఆయన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేసేందుకు అధికంగా నిధులు మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో జడ్పీటీసీ మల్లికార్జున్పాటిల్, సర్పంచ్ మహిపాల్రెడ్డి, ఎంపీటీసీ నవనీతా విష్ణువర్దన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బస్వరాజుపాటిల్, టీఆర్ఎస్ నాయకుడు సాయికుమార్, వరం వైస్ చైర్మన్ తుకారం, రాయికోడ్ ఏఎంసీ వైస్ చైర్మన్ మారుతి, మండల పంచాయతీ రాజ్ ఏఈ శశికుమార్, మండల టీఆర్ఎస్ నాయకుడు మహబూబ్ పాటిల్, సర్పంచ్, ఎంపీటీసీలు ఉన్నారు.