పటాన్చెరు, సెప్టెంబర్ 21: పటాన్చెరుకు త్వరలో రిజిస్ట్రేషన్ కార్యాలయం రానున్నది. బుధవారం ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో కలిసి తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్తో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రు లు కేటీఆర్, హరీశ్రావు సూచనల మేరకు వారు సీఎస్తో సమావేశమై పటాన్చెరులో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల సమయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు.
నగరానికి కూతవేటు దూరంలో ఉన్న పటాన్చెరులో రిజిస్ట్రేషన్ కార్యాలయం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్పందించిన చీఫ్ సెక్రటరీ పటాన్చెరులో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించిన పనులు వెంటనే ప్రారంభించాలని సీఎం కార్యదర్శి రాహుల్ బొజ్జాకు ఆదేశాలు జారీచేశారు. దీనితో కొత్తా ప్రభాకర్రెడ్డి, చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం
పటాన్చెరు టౌన్, సెప్టెంబర్ 21: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున బీమా సాయాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అందజేశారు. బుధవారం ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ చెక్కులను భారతీనగర్ డివిజన్ మ్యాక్ సొసైటీకి చెందిన మండల గంగమ్మ, బొల్లారం మున్సిపాలిటీకి చెందిన కొల్లని శంకర్ కుటుంబాలకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో అమీన్ఫూర్ జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, సింధూ ఆదర్శ్రెడ్డి, నాయకుడు వెంకటేశం గౌడ్, అధ్యక్షుడు పరమేశ్ యాదవ్, జిన్నారం మండల అధ్యక్షుడు రాజేశ్ పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయం మంజూరుపై హర్షం
జిన్నారం: పటాన్చెరులో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏ ర్పాటు చేయడంపై పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్ హ ర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, ఎంపీ ప్రభాకర్రెడ్డి, చేనేత కార్పొరేషన్ చైర్మన్ ప్రభాకర్, ఎమ్మెల్యే మహిపా ల్ రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.