సంగారెడ్డి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులు ప్రత్యే క దృష్టిసారించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సూ చించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో బుధవారం అదనపు కలెక్టర్లతో కలిసి తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, హరితహారం, పారిశుధ్యం, ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ, డబు ల్ బెడ్రూం ఇండ్లు, మనఊరు-మనబడి పనుల పురోగతి, బతుకమ్మ చీరల పంపిణీ తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో క్రీడా ప్రాంగణాలను పూర్తి చేయాలని, జిల్లాకు కేటాయించిన హరిత లక్ష్యం వంద శాతం పూర్తి కావాలన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో నాటిన మొక్క లపై నివేదిక ఇవ్వాలన్నారు. గ్రామపంచాయతీల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేయించాల్సిన బాధ్యత జిల్లా పంచాయతీ అధికారిపై ఉన్నదని తెలిపారు. ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేయాలని డీఎఫ్వో, డీఆర్డీవోలకు సూచించారు. ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ, మనఊరు-మనబడి పనులు త్వరితగతిన పూర్తి చేసి, పూర్తయిన పనులకు ఎంబీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. బతుకమ్మ చీరలను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా పంపిణీ చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా డీఎల్పీవోలు, ఎంపీవోలతో సమీక్షించాలని డీపీవో కు సూచించారు. తడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ను తయారు చేయాలన్నారు.
పొడి చెత్త అమ్మకానికి ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకోవాలని, చెత్త అమ్మకంతో గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డంపిం గ్ యార్డు, వైకుంఠ ధామాల చుట్టూ బయో ఫెన్సింగ్ చేయాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు రాజార్షి షా, వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో సురేశ్ మోహన్, డీఈవో రాజేశ్, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీసీవో ప్రసాద్, సివిల్ సప్లయి డీఎం సుగుణాబాయ్, డీసీవో, మెప్మా పీడీ గీత, డీఎంహెచ్వో గాయత్రీదేవి, చేనేత, ఔళీ శాఖ అధికారి ఏడీ విజయలక్ష్మి, మిషన్ భగీరథ, పీఆర్, హౌసింగ్ అధికారులు, జహీరాబాద్ ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.