చిన్నశంకరంపేట, సెప్టెంబర్19 : గర్బిణులు, బాలింతలు పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోవాలని సీడీపీవో స్వరూపరాణి సూచించారు. సోమవారం చిన్నశంకరంపేట లో పోషకాహార మహోత్సవాలను నిర్వహించి పోషకాహార పదార్థాలపై అవగాహన కల్పించారు. సామూహిక సీమాంతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో స్వరూపరాణి మాట్లాడుతూ గర్బిణులు, బాలింతలు పోషక విలువ లు గల ఆహారాన్ని తీసుకుంటే బిడ్డ ఎదుగుదల బాగుంటుందన్నారు. పాలు, గుడ్డు ఆకు కూరలు, పప్పు దినుసులు వం టి ఆహార పదార్థాలను తీసుకుంటే తల్లిబిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వర్రావు డిప్యూటీ తహసీల్దార్ మహేందర్గౌడ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ శైలజ వైద్య సిబ్బంది శ్రీనివాస్రావు అంగన్వాడీలు పాల్గొన్నారు.
చేగుంట,సెప్టెంబర్19,అంగన్వాడీ కేంద్రంలో బాలింతలు, గర్బిణులు, చిన్నారులకు పోషక విలువలు గల ఆహారాన్ని ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నదని శేరిపల్లి సర్పంచ్ చెప్యాల మల్లేశం అన్నారు. నార్సింగి మండలంలో ని శేరిపల్లి అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించి గర్బిణులు, బాలింతలు, చిన్నారులకు అవగాహన కల్పించా రు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఎల్లమ్మ, కృష్ణవేణి, ఆశవర్కర్ లక్ష్మీ, శ్రీధర్ ఉన్నారు.