తూప్రాన్, సెప్టెంబర్ 17 : మండల కేంద్రం తూప్రాన్లోని పాత తహసీల్ కార్యాలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న నూతన సమీకృత మండల కార్యాలయాల భవన నిర్మాణ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. ఎస్డీఎఫ్ కోటాలో మంజూరైన రూ. 8కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో సమీకృత కార్యాలయ సముదాయాన్ని నిర్మించడానికి ప్రత్యేక ప్రణాళిక రూ పొందించారు. ఈ ఏడాది మే 15న మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తూప్రాన్ పట్టణంలో సమీకృత మండల కార్యాలయాల సముదాయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సమీకృత మండల కార్యాలయాల సముదాయ భవన నిర్మాణం తూప్రాన్ పట్టణానికి మణిహారంగా మారనున్నది. సమీకృత సముదాయంలో ఆర్డీవో, తహసీల్, ఎంపీడీవో, సబ్ ట్రెజరీ, ఎంఈవో, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఐకేపీ, మెప్మా తదితర శాఖల కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని శాఖల కార్యాలయాలు ఒకే గొడు గు కిందకు రానున్నాయి. అన్ని కార్యాలయాలు ఒకేచోట నిర్మి స్తుండడంతో ప్రభుత్వ సేవలు ఒకేచోట లభించనున్నాయి.
తీరనున్న పౌర సేవల ఇబ్బందులు
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న తూప్రాన్ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ మున్సిపాలిటీగా అవతరించింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా తూప్రాన్ డివిజన్ కేంద్రంగా రూపుదిద్దుకుంది. దీంతో మండలస్థాయి కార్యాలయాలతో పాటు, నూతనంగా ఏర్పడ్డ డివిజన్ స్థాయి కార్యాలయాలు సైతం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఒక ఆఫీసు ఒకచోట ఉంటే దానికి అనుబంధంగా ఉన్న ఆఫీసు మరోచోట ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యం లో సకల సౌకర్యాలతో కార్యాలయాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ మా ర్కెట్తో కళకళలాడుతున్న తూప్రాన్ పట్టణ సిగలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ రూపంలో మరో కలికితురాయి చేరబోతున్నది.
ఏడాదిన్నరలో పూర్తిచేస్తాం
తూప్రాన్ పట్టణంలో సమీకృత కార్యాలయ భవన సముదాయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏడాదిన్నరలో పనులన్నీ పూర్తి చేస్తాం. సమీకృత భవనాన్ని మున్సిపల్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. – సాయికృష్ణ, పీఆర్ఏఈ,