మెదక్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : దేశానికి స్వాతం త్య్రం సిద్ధించిన ఏడాది తర్వాత, రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి పొంది తెలంగాణ దేశంలో అంతర్భాగమై 75 వసంతాలు పూర్తైన సందర్భంగా ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చడానికి జాతీయ సమై క్యతా వజ్రోత్సవాలను మూడు రోజుల పాటు రాష్ట్రమంతటా గొప్పగా నిర్వహించుకుంటున్నామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నా రు. వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ద్వారకా గార్డెన్స్లో ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్న తెలంగాణ రాష్ట్రం తన అస్తి త్వాన్ని కోల్పోతున్నదని గమనించి 14 సంవత్సరాలు పోరాటం చేసి సీఎం కేసీఆర్ తెలంగాణను సాధించారన్నారు. దేశంలో కేంద్రప్రభుత్వం 160 మెడికల్ కాలేజీలు ఇచ్చినప్పటికీ తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో పాలించిన బీజేపీ, కాంగ్రెస్ రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్ పథకాలను ఇవ్వాలన్న ఆలోచన లేదన్నారు. యాసంగిలో పండిన పంటను కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేసిందన్నారు. సింగరేణి, రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలను ప్రైవేటీకరణ చేసిందని, కరెంటును కూడా ప్రైవేటీకరణ చేయాలని కేంద్రప్రభుత్వం ప్రయాత్నం చేస్తుందన్నారు. బోర్ల వద్ద విద్యుత్ మీటర్లు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వం పంపిన జీవోను తెలంగాణలో అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసి తిరిగి కేంద్రాన్ని పంపడం జరిగిందన్నారు. తెలంగాణ జా తీయ సమైక్యతా వజ్రోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పట్టణాల, గ్రామాల్లో, ప్రజలందరిలో జాతీయ భావం పెంపొందించమన్నారు. మెదక్ జిల్లాకు బీసీ మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు.
అందరికీ ధన్యవాదాలు
మనభాష, మన సంసృతి, మెదక్ జిల్లా ఔనత్యా న్ని చాటి చెప్పే విధంగా జిలాల్లో మూడు రోజుల పాటు ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించుకున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొ ని విజయవంతం చేసిన పోలీసులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు ప్రతి ఒకరికీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
105మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గంలోని 105 మంది లబ్ధిదారులకు 39లక్షల కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెకులను, 69 మందికి 31లక్షల సీఎంఆర్ఎఫ్ (మెడికల్ రీయంబర్స్మెంట్) చెకులను ఎమ్మెల్యే అం దజేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మె ల్యే, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్తో పాటు టీఆర్ఎస్ నాయకులు, గిరిజన నా యకులు క్షీరాభిషేకం చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అంద రూ కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగిందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జాతీయ భావం పెరిగి అందరిలో చైత న్యం వచ్చిందన్నారు. ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకుంటూ గిరిజనుల్లో గొప్ప సంక ల్పం కలిగించిందన్నారు. అనంతరం 12మంది స్వాతం త్య్ర సమరయోధుల కుటుంబాలను ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపా ల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్లు శాలువాలతో సన్మానించారు.
సాంసృతిక కార్యక్రమా ల్లో పాల్గొన్న చిన్నారులను, సాంసృతిక సారథి కళాకారులను, వజ్రోత్సవాల్లో పాల్గొన్న వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విద్యార్థులతో కలిసి పిల్లలతో ఆడిపాడి ఉత్సాహన్ని, ఉత్తేజాన్ని నింపారు. విద్యార్థులు పోతారాజుల వేషధారణలతో, బతుకమ్మ, బోనాలు పాటలతో, సాంసృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మారెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రగౌ డ్, ఆర్డీవో సాయిరాం, డీఈవో రమేశ్ కుమా ర్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎంఈవో నీలకంఠం, ఎంపీపీ లు యమునాజయరాంరెడ్డి, శేరి నారాయణరెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, విద్యార్థినీ, విద్యా ర్థులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.