మెదక్, ఫిబ్రవరి 10 : దళితబంధు పథకం దళితుల ఆర్థిక అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం మెదక్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మెదక్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.10 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. దళితబంధుపై త్వరలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు. రెండో విడుతలో మెదక్, రామాయంపేట పట్టణాల్లో దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్కు ఇటీవల ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులతో మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారని, మార్చిలోగా పనులన్నీ పూర్తి చేసి ఏప్రిల్లో మెదక్కు రైలు కూత వినిపించనున్నట్లు పేర్కొన్నారు.
సీసీ రోడ్లకు రూ.15 కోట్లు మంజూరు..
ఉపాధిహామీ పథకం కింద రెండో విడుతగా మెదక్ నియోజకవర్గానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు మరో రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బీటీ రోడ్ల రెన్యువల్ కోసం రూ.8 కోట్లు మంజూరు కాగా, త్వరలో మరిన్ని ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే నిధులు రూ.3 కోట్లతో గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ.5 కోట్లతో మెదక్ స్టేడియంలో చేపట్టిన సింథటిక్ ట్రాక్ నిర్మాణం, డెవలప్మెంట్ పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ పనులు త్వరలో పూర్తిచేయించి బోటింగ్ను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మెదక్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న షాదీఖానాకు రూ.కోటి మంజూరయ్యాయని, రంజాన్లోపు పనులు పూర్తి చేయిస్తామన్నారు. ఏడుపాయల జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందని తెలిపారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు బీమరి కిశోర్, నర్వ లక్ష్మీనారాయణగౌడ్, వంజరి జయరాజ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, హవేళీఘనపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు కిష్టయ్య, టీఆర్ఎస్ నాయకులు రాగి అశోక్, గూడూరి అరవింద్గౌడ్, శ్రీధర్యాదవ్, ఉమర్ పాల్గొన్నారు.
జిల్లాలో 256 మంది లబ్ధిదారుల ఎంపిక
‘దళితబంధు’తో దళితుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయని, ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నామని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఆరు మండలాల చొప్పున మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో 200 మంది లబ్ధిదారులు, అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండలం హసన్మహ్మద్పల్లిలో 56 మంది లబ్ధిదారులతో కలిపి మొత్తంగా జిల్లాలో 256 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. గురువారం కలెక్టరేట్లో దళితబంధు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. హవేళీఘనపూర్ మండలంలోని జక్కన్నపేట, మెదక్ మండలంలోని వెంకటాపూర్లో 20 మంది లబ్ధిదారుల చొప్పున, నిజాంపేట మండలంలోని రాంపూర్, పాపన్నపేట మండలంలోని అబ్లాపూర్లో 18 మంది లబ్ధిదారుల చొప్పున, రామాయంపేట మండలంలోని శివ్వాయిపల్లిలో 7 మంది, చిన్నశంకరంపేట మండలం చం దంపేటలో 17 మంది చొప్పున 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి మండలం వెంకటాపూర్ బీ గ్రామంలో 34మంది, చిలిపిచెడ్ మండలం రాందాస్గూడలో ఇద్దరు, నర్సాపూర్ మం డలం తిరుమలాపూర్లో 20 మంది, శివ్వంపేట మండలం తిమ్మాపూర్లో 18 మంది, మాసాయిపేట మండలం రామంతాపూర్లో 24 మంది, వెల్దుర్తి మండలం బండమీదిపల్లిలో ఇద్దరు చొప్పున 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండలం హసన్ మహ్మద్పల్లిలో 56 మందిని గుర్తించామన్నారు.
201 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు తెరిచాం..
ఇప్పటి వరకు 201 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు తెరిచామని, 169 మంది లబ్ధిదారుల వివరాలు పోర్టల్లో నమోదు చేశామని కలెక్టర్ తెలిపారు. చాలా మంది లబ్ధిదారులు పాడి, పౌల్ట్రీ, హార్వెస్టర్, కిరాణా, పరిశ్రమలు, రవాణా, పందిరి సాగు, కూరగాయల సాగు వంటి యూనిట్లు నెల్పడానికి ముందుకు వచ్చారన్నారు. ఎమ్మెల్యేల అనుమతితో గ్రామాల్లో ఈ నెల 14 నుంచి 17 వరకు లబ్ధిదారులకు అవగాహన కలిగించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఎస్డీవో విజయలక్ష్మి, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి, డీపీవో తరుణ్కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాంనాయక్, ఉద్యాన శాఖ అధికారి నర్సయ్య, పశు సంవర్ధక శాఖ అధికారి విజయకృష్ణారెడ్డి, ఆర్డీవో సాయిరాం అధికారులు పాల్గొన్నారు.