మెదక్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): స్థానిక భౌగోళిక పరిస్థితులను, ప్రజల జీవన విధానాన్ని తెలుసుకున్నప్పుడే పదవికి సంపూర్ణ న్యాయం చేయగలుగుతామని మెదక్ కలెక్టర్ హరీశ్ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులకు హితవు చెప్పారు. ధాన్యం సేకరణపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఒకరోజు శిక్షణలో భాగంగా మంగళవారం హైదరాబాద్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుంచి తెలంగాణ క్యాడర్కు చెందిన ఆరుగురు ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు రాధికాగుప్త (ఖమ్మం), శ్రీజ (ఆదిలాబాద్), గౌతమి (మంచిర్యాల), పర్మర్ పింకేశ్ కుమార్ లలిత్ కుమార్ (మహబూబాబాద్), లెనిన్ వత్సల్ టొప్పో (కరీంనగర్), శివేంద్ర ప్రతాప్ (కామారెడ్డి) మెదక్ జిల్లాకు వచ్చారు.
వీరు ముందుగా నర్సాపూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, స్వయం సహాయాక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను, రెడ్డిపల్లిలోని వెంకటేశ్వర ఇండస్ట్రీస్ రైస్ మిల్లును, మెదక్ చర్చిని సందర్శించారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేష్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ మొదలు మిల్లుకు తరలించి, రైతులకు డబ్బులు చెల్లించే వరకు వివిధ స్థాయిలలో జరుగు ప్రక్రియలను కలెక్టర్ ఐఏఎస్ బృందానికి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ప్రాంతీయ భాషలో మాట్లాడితేనే వివిధ అంశాలపై అవగాహన వస్తుందని, చకటి పరిపాలనను అందించవచ్చన్నారు. మెదక్ జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఇకడ వరి ఎకువగా పండిస్తారన్నారు.
ఉమ్మడి జిల్లాలో 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుండగా, నేడు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు సమృద్ధిగా ఉండడం వల్ల మూడింతల పంట వస్తుందన్నారు. గత యాసంగిలో ఇబ్బడిముబ్బడిగా వచ్చిన పంటను భద్రపరచడానికి గోదాములు లేక కలెక్టరేట్లో, పాఠశాల, కళాశాల తదితర ప్రాంతాల్లో భద్రపరిచామన్నారు. కొనుగోలు కేంద్రాలను రైస్ మిల్లులకు అనుసంధిస్తూ ధాన్యం తరలించి ఆన్ లైన్ ద్వారా ఓపీఎంఎస్ యాప్లో వివరాలు నమోదు చేసి రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని కలెక్టర్ బృందానికి వివరించారు. ప్రధానంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ ఆధ్వర్యంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించి, అకడ మర ఆడించిన సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్సీఐకి తరలిస్తున్నామని కలెక్టర్ వారికి వివరించారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల తరువాత అత్యధికంగా పంట వచ్చేది మెదక్ జిల్లాలోనే అని, అధికారుల సమష్టి కృషి, సమన్వయంతో జిల్లాలో ధాన్యం సేకరణ సజావుగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ వానకాలంలో ఇప్పటి వరకు 90 శాతం ధాన్యం సేకరించామని, మరో వారం రోజులలో పూర్తి చేస్తామన్నారు. నర్సాపూర్లో కొనుగోలు కేంద్రాల సందర్శన సందర్భంగా మీరు పరిశీలించిన అంశాలు, ఇంకా మెరుగుపర్చవలసిన అంశాలు ఏమైనా ఉంటే తెలపాల్సిందిగా కోరారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 1 వరకు శిక్షణ అనంతరం జిల్లాలకు వెళ్లనున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులకు కలెక్టర్ హరీశ్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్వో శ్రీనివాస్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపాల్, సహాయ కమిషనర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
పనులు వేగంగా పూర్తి చేయాలి
తూప్రాన్, నవంబర్ 29: ఉమ్మడి తూప్రాన్ మండలంలో పురోగతిలో ఉన్న పలు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. మంగళవారం తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ఐఐసీకి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం కింద ఇవ్వడానికి గతంలో ముప్పిరెడ్డిపల్లి శివారులో గ్రామ పంచాయతీ లేఅవుట్ ప్రకారం 386 ప్లాట్లను వేయడం జరిగిందని, ప్రస్తుతం హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం ఆ లేవుట్ను రీడిజైన్ చేసి వారం, పది రోజుల్లో పట్టాల పంపిణీకి ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి తూప్రాన్ మండలంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్లు తదితర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమలో ఇన్చార్జి ఆర్డీవో సాయిరాం, ‘గడ’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మోహన్, మున్సిపల్ ఏఈ జుంకీలాల్, పంచాయతీరాజ్ డీఈ నర్సింలు, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, అధికారులు పాల్గొన్నారు.