పటాన్చెరు టౌన్, జూన్ 13 : పోచమ్మ తల్లి ఆశీస్సులే తమకు శ్రీరామరక్ష ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం రామేశ్వరంబండ గ్రామం పోచమ్మ తల్లి విగ్రహప్రతిష్ఠాపన, బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గ్రామ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పోచమ్మ తల్లి దయతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. సర్పంచ్ ధరణి అంతిరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో గ్రామం అన్ని రకాలుగా బాగుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దశరథరెడ్డి, బీ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
రామచంద్రాపురం,జూన్ 13: భారతీనగర్ డివిజన్లోని మ్యాక్ సొసైటీలో కనకదుర్గ దేవి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం సంతృప్తినిచ్చిందన్నారు. కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్యాదవ్, మ్యాక్సొసైటీ అధ్యక్షుడు పాపయ్యయాదవ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, డివిజన్ అధ్యక్షుడు బూన్, భాస్కర్, రాణి ఉన్నారు.
అమీన్పూర్, జూన్ 13: పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించడంతోపాటు పురాతన ఆలయాలను అభి చేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నరేంద్ర నగర్ కాలనీ జివ్వి గుట్టపై నూతనంగా నిర్మించిన రాధాకృష్ణ స్వామి, శివాలయం, ఆంజనేయ గరుడ ఆలయంలో సోమవారం ఏర్పాటు చేసిన రాజగోపుర నిర్మాణానికి రూ.9 లక్షల భూరి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవ చింతన ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిన్నారం, జూన్ 13 : మనసుకు నచ్చిన దేవుని సన్నిదికి వెళ్లి దర్శించుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గడ్డపోతారంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన సోమవారం ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక సర్పంచ్ ప్రకాశ్చారి, నాయకులు ఎమ్మెల్యేను శాలువా, పూలమాలలతో సన్మానించారు.
కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, ఎంపీటీసీ జనాబాయి, మాజీ సర్పంచ్లు ఎంపీ అశోక్, నీరుడి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బాశెట్టి రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, ఉపసర్పంచ్ మమతాపెంటేశ్, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.