రాష్ట్ర ప్రభుత్వం వానకాలం సాగుకు రైతును సమాయత్తం చేస్తున్నది. ఇందుకు జిల్లాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నది. నేడు(మంగళవారం) గజ్వేల్లోని మహతి ఆడిటోరియంలో ‘వానకాలం సాగుకు సమాయత్తం’ సదస్సు జరుగనున్నది. దీనికి ముఖ్యఅతిథులుగా ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరుకానుండగా, వ్యవసాయ శాఖ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వానకాలంలో ఏ పంటలు వేయాలి? దిగుబడి మంచిగా వచ్చేది ఏది? లాభదాయకమేది? సాగులో మెలకువలు ఏమిటి? తదితర విషయాలపై మంత్రులు దిశానిర్దేశం చేయనున్నారు.
సమావేశానికి 1500 మందికి పైగా ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతుబంధు కోఆర్డినేటర్లు హాజరుకానున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ సాగు ప్రణాళిక సిద్ధం చేసి, ఏర్పాట్లలో నిమగ్నమైంది.
సిద్దిపేట, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రోహిణి కార్తె వచ్చింది.. సాగు పనుల్లో రైతు లో కం నిమగ్నమవుతున్నది. తొలకరి జల్లులకు దు క్కులు సిద్ధం చేయడానికి అంతా రెడీ చేసుకుంటున్నది. వానకాలంలో ఏ పంటలు వేయాలి? దిగుబడి మంచిగా వచ్చేది ఏది? లాభదాయకమేది? సాగులో మెలకువలు ఏమిటి? తదితర విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా వానకాలం సాగుకు రైతులను సమాయత్తం చేస్తూ సదస్సులు నిర్వహిస్తున్నది.
ఇందులో భాగంగా సిద్దిపేట, మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లో ‘వానకాలం సాగుకు సమాయత్తం’ ఒకరోజు వర్క్ షాప్ గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరి యంలో మంగళవారం ఉదయం 10గంటలకు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరవుతున్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలోని ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, ఆత్మ, ఏఎంసీ చైర్మన్లు, రైతుబంధు సమితి సభ్యులు, ఎంపీపీ, జడ్పీటీసీ లు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొంటారు. సమావేశా నికి 1500 మందికి పైగా హాజరుకానున్నారు.
వానకాలం సాగుకు జిల్లా సన్నద్ధమవుతున్నది. రా ష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నది. జిల్లాలో 9,12,947 ఎకరాల జి యోగ్రాఫీ ఏరియా ఉంది. ఇందులో అటవీ భూ మి 52,380 ఎకరాలు, సాగుకు యోగ్యం కానిది 44,152 ఎకరాలుండగా, సాగు యోగ్య మైనవి 7,01,902 ఎకరాలు, సరాసరిగా 5,63,005 ఎకరాలు సాగు అవుతున్నది. ఈ సా రి వానకాలం(2022-23)లో జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు.
ఇందుకు గాను 62,500 క్విం టాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. 12,500 టీఎస్ఎస్ఐడీసీ, రైతులు 6250 క్వింటాళ్లు, ప్రైవే టుగా 43,750. పత్తి సాగు 2 లక్షల ఎకరాల్లో సా గుకు గాను 1800 క్వింటాళ్లు, కందులు 40 వేల ఎకరాలు 1600 క్వింటాళ్లు, మక్కజొన్న 50 వేల ఎకరాలు, పెసర్లు 9 ఎకరాలు తదితర పంటలను సాగు చేయనున్నారు. ఇందుకు అవసరమైన సీడ్స్ను వ్యవసాయ శాఖ అధికారులు ఆ యా మండలాల్లో సిద్ధం చేస్తున్నారు. జీలుగ, జనుము విత్తనాలను అందిస్తున్నారు.
జిల్లాకు 49,888 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 16,553 మెట్రిక్ టన్నుల యూరి యా అందుబాటులో ఉంది. డీఏపీ 26,440 మె ట్రిక్ టన్నులకు గాను 1891 మెట్రిక్ టన్నులు, ఎంవో పీ 8277 మెట్రిక్ టన్నులకు 440 మెట్రిక్ టన్ను లు, కాంప్లెక్స్ 51,884 మెట్రిక్ టన్నులకు 12,957మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది.
నత్రజని ఎరువును విడతల వారీగా వేయడం పోషక యాజమా న్యంలో కీలక పాత్ర వహిస్తుంది. దఫాలుగా నత్రజని ఎరువును పంట పెరిగే దశలను అనుసరించి వేయడం ఉత్పత్తిదాయకం, లాభదాయకమే కాకుండా పర్యావరణ హితంగా ఉంటుంది. సిఫారసు చేసిన నత్రజని మోతాదును రెండు లేక అంతకన్నా ఎక్కువ దఫాలుగా పంటకు అందించడంతో మొక్కకు మెరుగైన పోషణ లభిస్తుంది. ఈ రకంగా నత్రజని ఎరువు వేయడంతో పోషకాలు నష్టపోకుండా ఉండడమే కాకుండా మంచి దిగుబడులు రావడానికి దోహదపడుతుంది.
మొక్కలకు ఎరువును నెమ్మదిగా విడుదల అవ్వ డంతో ఎక్కువ ఫలదాయకం వస్తుంది. నత్రజని ఎరువును పొదుపుగా వాడుకునే అవకాశం ఉంది. వాయిదాల పద్ధతిలో మొక్కలకు నత్రజని అందించడంతో మొక్కలు నత్రజనిని మంచిగా ఉపయోగిస్తాయి. విడత వారీగా యూరియా వేసుకోవడంతో పురుగులు, తెగుళ్ల తాకిడిని తగ్గిస్తుంది. దఫాలుగా యూరియాను వినియోగించడంతో దిగుబడులు పెరుగుతాయి. ఎరువులపై ఖర్చును పొదుపు చేసుకోవచ్చు. మొక్కల కాండం ధృడంగా పెరగడానికి పొటాషియం తోడ్పడుతుంది. కణాల బయటి గోడల మందాన్ని పెంచడం ద్వారా మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సరిపడా పొటాషియం అందిస్తే ఎదుగుతున్న మొక్కలు తేమ నష్టపోకుండా కాపాడుతుంది. పండ్లు, కూరగాయల్లో మంచి రంగు, రుచిని పెంచడమే కాక నిల్వ ఉండే శక్తిని పెంచుతుంది.
పచ్చిరొట్ట ఎరువులు నేలను కప్పే పంట. పచ్చిరొట్ట (జీలుగ, జనుము, పెసర, పిల్లిపెసర) ప్రాథమికంగా నేలకు పోషకాలు అందిస్తుంది. సేంద్రియ పదార్థాన్ని పెంచుతుంది. పచ్చిరొట్ట పంటను 30-40 రోజుల ప్పుడు పూత దశలో నేలలో కలియ దున్నాలి. తద్వార నేలలో పోషకాలు సేంద్రియ పదార్థం పెరుగుతాయి.
వానకాలం వర్షాలను సద్వినియోగం చేసుకొని సకాలంలో వరిని విత్తుకో వడం తద్వారా యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేసుకోవడానికి అనువైన వాతావరణం కలిగి ఉంటుంది. నారుమడి, నాటు వేయాల్సిన పనిలేదు. విత్తన మోతాదు సగానికి సగం తగ్గించుకోవచ్చు. ఎకరాకు రూ. 7వేలు ఆదా అవు తుంది. నేరుగా విత్తినప్పుడు వరి వారం నుంచి పది రోజులు ముందుగా కోతకు వస్తుంది. విలువైన నీరును 25 నుంచి 30శాతం వరకు ఆదా చేసుకోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం ఇత ర పంటల సాగును ప్రోత్సహిస్తు న్నది. సన్నరకం వరితో పాటు పత్తి, కంది తదితర పంటలను ఎక్కువగా సాగు చేసేలా రైతులను సన్నద్ధం చేస్తు న్నది. జిల్లాలో గతేడాది నుంచి ఆయిల్ పామ్ను సాగు చేస్తున్నారు. నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్పామ్ పరిశ్రమ పనులు మొదలయ్యాయి. ఆయిల్పామ్ సాగు చేసే రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నది. దీంతో పాటు పట్టు పరిశ్రమను ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో చాలా చోట్ల పట్టు పురుగుల పెంపకాన్ని రైతులు చేపడుతున్నారు. మల్బరీ సాగుకు ఇప్పుడిప్పుడే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ పంటలో మంచి లాభాలు ఉండడంతో రైతులు ఆ దిశగా ముందుకెళ్తున్నారు. గతేడాది నుంచి జిల్లాలో ఎక్కువ సంఖ్యలో రైతులు సాగు చేస్తున్నారు. కూరగాయల సాగుతో రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. వరిలో వెదజల్లే పద్ధతి అవలంభిస్తున్నారు.
గజ్వేల్లో జరిగే రైతు అవగాహన సదస్సుకు జిల్లాలోని రైతుబంధు సమితి నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలి. వానకాలం సమీపించినందున రైతులకు అవసరమయ్యే విలులైన సూచనలు, సలహాలు అందించే ఈ అవగాహన సదస్సుకు రైతుబంధు సమితి మండల, గ్రామ కోఆర్డినేటర్లు, అన్ని గ్రామాల్లోని సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మంత్రులు హరీశ్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు ఈ సదస్సుకు హాజరై రైతులకు అవగాహన కల్పిస్తారు.
– వంగ నాగిరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్