స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తం సేకరించారు. మెదక్లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రారంభించారు. నారాయణఖేడ్ ఏరియా దవాఖానలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ప్రారంభించగా.. విశేష స్పందన లభించింది. జోగిపేట ప్రభుత్వ దవాఖానలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని రక్తం ఇచ్చారు.
పటాన్చెరు ఏరియా దవాఖానలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. బొల్లారం మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది రక్తదానం చేశారు. సదాశివపేట సర్కారు దవాఖానలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జహీరాబాద్, కౌడిపల్లి, చిలిపిచెడ్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ దవాఖానలో ఎమ్మెల్యే మదన్రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు.
రక్తదానం మహాదానమే కాదు.., ప్రాణదానం కూడా.. ఆపదలో ఉన్న రోగికి కావాల్సిన రక్తం లభించక ఎన్నో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అలాంటి సమస్య రాకుండా రక్తదానానికి ముందుకు వచ్చిన వారు ప్రాణదాతలతో సమానమని చెప్పవచ్చు. 75వ స్వత్ంరత్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం రక్తదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలకు మెదక్, సంగారెడ్డి జిల్లాల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభించిన రక్తదాన శిబిరాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు రక్తదానం చేశారు.
పటాన్చెరు, నారాయణఖేడ్, నర్సాపూర్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, భూపాల్రెడ్డి, మదన్రెడ్డి, మాణిక్రావు రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో కలెక్టర్ శరత్, మెదక్లో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ శిబిరాలను ప్రారంభించారు. అదేవిధంగా సంగారెడ్డి పోలీస్ కల్యాణ మండపంలో ఎస్పీ రమణకుమార్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన శిబిరాల్లో రక్తదానం చేసిన వారికి ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రశంసా పత్రాలు అందజేశారు.
– మెదక్, సంగారెడ్డి నెట్వర్క్, ఆగస్టు 17