కొండాపూర్, ఆగస్టు17: రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ తెలిపారు. బుధవారం మండలంలోని గొల్లపల్లి గ్రామం లో పీఏసీఎస్ గోదాం నిర్మాణానికి భూమి పూజచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను దృష్టి లో ఉంచుకుని వారి ఇబ్బందులను తీర్చేందుకు సీఎం కేసీఆర్ గొల్లపల్లి సొసైటీకి రూ.35 లక్షల నిధులు మం జూరు చేశారన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దివ్యాంగులకు రూ.3,016, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2016, పైలేరియా వ్యాధిగ్రస్తులకు పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15న మరో 10 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూ రు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. రైతులను ఆదుకునేందుకు రైతుబీమా, రైతు బంధు అందిస్తున్నారన్నారు. రైతులకు ఉచితంగా కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేంద్రం రైతులను ఇబ్బందులు పెట్టేందుకు బావులు, మోటర్లు వద్ద మీటర్లు ఏర్పాటు చేస్తామనడం విచారకరమన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ మనోజ్రెడ్డి, జడ్పీటీసీ పద్మావతి పాండురంగం, పీఏఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, సీఈవో శ్రీనివాసరావు, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మీరాంచంద్రయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకం విఠల్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహరెడ్డి, సర్పంచ్ శివలీలా జగదీశ్వర్, ప్రకాశం, రాములు, ఎంపీటీసీ రాందాస్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, మాజీ సర్పంచ్ గోవర్ధన్రెడ్డి, మాజీ సర్పంచ్ రామాగౌడ్, నాయకులు బుచ్చిరెడ్డి, మల్లాగౌడ్, రఘునాథ్రెడ్డి, జలీల్, ప్రభుదాస్, ప్రేమనందం, అమరేందర్రెడ్డి పాల్గొన్నారు.