మెదక్, ఆగస్టు17(నమస్తే తెలంగాణ): రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని మెదక్లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు ప్రతిరోజూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తం దానం చేస్తే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తాయని ఉన్న అపోహలను ఆమె తొలిగించారు. రక్తదానంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ డాక్టర్లు చంద్రశేఖర్, శివదయాల్, నవీన్ కుమార్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. రక్తదానం ప్రాణదానంతో సమానమని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. రక్తదానం అన్ని దానాల్లో గొప్పదని, ఒకరి నుంచి సేకరించిన రక్తం అవసరమైన వ్యక్తులకు ఉపయోగపడి వారి ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. రెవెన్యూ, సివిల్ సైప్లె, సర్వే అండ్ల్యాండ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
రక్తదానం చేసిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వాణి, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. రక్తదానం చేసి రక్త ప్రదాతలుగా నిలువాలని ఎస్పీ రమణకుమార్ అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది, యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ రవీంద్రారెడ్డి, ఎఆర్ డీఎస్పీ జనార్ధన్, సీఐలు రమేశ్. మహేశ్గౌడ్, శివలింగం, రాంరెడ్డి, ఎస్ఐలు శ్రీనివాస్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, ఆర్ఐ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
నారాయణఖేడ్లో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు పాల్గొన్నారు. జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. పటాన్చెరు పట్టణంలోని ఏరియా దవాఖానలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సమక్షంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జహీరాబాద్లోని సర్కారు దవాఖానలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, పోలీస్ అధికారులు, వైద్యులు, నాయకులు పాల్గొన్నారు.