మెదక్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి పుట్టిన రోజును మెదక్ నియోజకవర్గం అంతటా సంబురంగా నిర్వహించారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, యువత, అభిమానులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో జమ్మి మొక్కను నాటారు.
హావేళీఘనపూర్లో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో పాపన్నపేట నాయకుడు ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక దవాఖానలో పండ్లు పంపిణీచేశారు. మెదక్లోని చర్చ్లో టీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షుడు శామ్సన్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
మెదక్లోని ప్రభుత్వ దవాఖానలో పండ్లు పంపిణీచేశారు. సంధ్యా నిలయంలో వృద్ధులతో కేక్ కట్ చేశారు. రామాయంపేట్లో అనాథ యువతి వివాహానికి ఎమ్మెల్సీ తరఫున సర్పంచ్లు రాజాసింగ్, శ్రీను నాయకులు ఆర్థిక సాయం అందించారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్ నేతృత్వంలో కేక్ కట్చేశారు. నిజాంపేట్ జడ్పీటీసీ పంజా విజయ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.