మర్కూక్, ఆగస్టు 9: ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి గులాబీ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం మీదుగా నర్సంపేటకు వెళ్తుండగా ఆదివారం కాశిరెడ్డిపల్లి గ్రామస్తులు సమస్యలు తెలియజేశారు. గ్రామంలో కల్యాణమండపం వద్ద కిచెన్ షెడ్ నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.63లక్షలు మంజూరు చేసినా ఇప్పటి వరకు అధికారులు పనులు ప్రారంభించడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పనులు చేపట్టేలా చూస్తానన్నారు. గ్రామంలో నెలకొన్న ఇతర సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. కేసీఆర్ను కలిసిన వారిలో గ్రామ కమిటీ అధ్యక్షుడు సింగం ప్రభాకర్ తదితరులు ఉన్నారు.