మెదక్ రూరల్/ రామాయంపేట, ఆగస్టు 11 : జిల్లాలోని మార్కెట్లు, దుకాణాలు ‘రాఖీ’ పండుగ జోష్తో కళకళలాడుతు న్నాయి. కరోనా నేపథ్యంలో రెండేండ్లలో అంతంత మాత్రంగా ఉన్న రాఖీ మార్కెట్ ఇప్పుడు కొలుకున్నది. రక్షాబంధన్ సందర్భంగా మార్కెట్లో తక్కువ ధర నుంచి భారీ ధరకు లభించే అన్నిరకాల రాఖీలు లభిస్తున్నాయి.
రూ.10 నుంచి రూ.1000 ధరల్లో సరికొత్త డిజైన్లలో రాఖీలు లభిస్తున్నాయి. పిల్లలను ఆకట్టుకునేందుకు బాలగణేశ్, చోటాభీమ్, మిక్కీమౌస్, నీమే తదితర పాత్రల బొమ్మలతో రాఖీలు విక్రయిస్తున్నారు. అమెజాన్, ప్లిప్కార్టు ఆన్లైన్లో రాఖీ స్టోర్లు ఏర్పాటు చేస్తున్నాయి.
రామాయంపేట పట్టణం సమీపంలోని ఆరు మండలాలకు అందుబాటులో ఉన్నది. హైదరాబాద్ నగరంలో ఉండే వ్యాపా రాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. పట్టణంలో వ్యాపారులు సుమారు 100కి పైగానే స్టాళ్లను ఏర్పాటు చేసి రాఖీలను విక్రయిస్తున్నారు. రాఖీల కోసం చిన్నశంకరంపేట, నిజాంపేట, నార్సింగి, చేగుంట, కామారెడ్డి జిల్లా భిక్కనూరు, బీబీపేట వాసులు రామాయంపేట పట్టణానికే చేరుకుంటారు.