మెదక్ అర్బన్, ఆగస్టు11 : టెక్నాలజీతోనే ప్రపంచం అభివృద్ధి చెందుతున్నదని, టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మన చేతుల్లో ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రం మెదక్లోని క్రిస్టల్ గార్డెన్లో విద్య, పోలీస్ శాఖల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. సైబర్ అంబాసిడర్లు, సైబర్ నేరాలు అరికట్టడంపై డీజీపీ మహేందర్రెడ్డి ఇచ్చిన సందేశాన్ని వీడియో క్లిప్పింగ్ ద్వారా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ టెక్నాలజీతో అద్భుతాలు జరుగుతున్నాయి, అనా ర్థాలు జరుగుతున్నట్లు తెలిపారు. టెక్నాలజీతో లాభం, నష్టం ఉంటాయని.. మంచి, చెడు మనిషి విచక్షణపై ఆధారపడి ఉం టుందన్నారు. మనసును కంట్రోల్ చేసుకుంటే ఏదైనా సాధించవచ్చని సూచించారు. మానవ మనుగడకు టెక్నాలజీ ఎంతో ముఖ్యమని.. టెక్నాలజీతో ఎన్నో నేర్చుకోవచ్చని తెలిపారు. ఎక్కడో అమెరికాలో ఉన్నవారితో క్షణాల్లో మాట్లాడవచ్చని, వారి బాగోగులు, మన క్షేమ సమాచారాన్ని చర్చించుకోవచ్చ న్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ఏర్పాటు చేసిన సైబర్ అంబాసిడర్లు ఉన్నత ఆశయంతో ప్రజలకు అవగాహన కల్పిం చాలని సూచించారు.
భవిష్యత్లో టెక్నాలజీ వినియోగం భారీగా పెరుగుతుందని, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని వివరించారు. ప్రతి విద్యాసంస్థల్లో సైబర్ నేరాలు, షీ టీమ్స్ ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. సైబర్ నేరాలపై ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉమెన్ సేఫ్టీ పోలీసు సహకారంతో మరింత మంది సైబర్ అంబాసిడర్లను తయారు చేసు కోవాలని సూచిచారు
మహిళలు, బాలికల రక్షణ కోసం ప్ర భుత్వం రూపొందించిన చట్టాలను తెలుసుకోవాలని, అవసర సమయాల్లో చట్టాల సాయం తీసుకోవాలని కలెక్టర్ వివరిం చారు. డయల్ 100, సైబర్ నేరం జరిగితే వెంటనే లేదా 24 గంటలలోపు జాతీయ సైబర్ హెల్ప్ నెంబర్ 1930, చిల్డ్రన్ హెల్ప్ లైన్ నంబర్1098 ఫోన్ చేసేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సైబర్ అంబాసిడర్లకు సూచించారు.
అదనపు ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ.. సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించడానికి 2021 జూన్లో సైబర్ కాం గ్రెస్ ఉమెన్ సేఫ్టీని ఏర్పాటు చేశారన్నారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలో 51 ప్రభుత్వ పా ఠశాలల్లో 102 మంది సైబర్ అంబాసిడర్లను నియమించామని తెలిపారు. వీరిని సమన్వ యం చేయడానికి ఒక ఉపాధ్యాయుడిని మానిటర్గా నియమించామని తెలిపారు.
ఆన్లైన్ ద్వారా సెషన్ల వారీగా విద్యా ర్థులకు సైబర్ నేరాలపై పూర్తి అవగాహన కల్పించామన్నారు. సైబర్ అంబాసిడర్లుగా ఉత్తమ సేవలు అందించిన విద్యార్థులు, టీచర్లతోపాటు నిజాంపేట జడ్పీ స్కూల్కు మొద టి, మెదక్ జడ్పీ స్కూల్కు ద్వితీయ, మాచవరం జడ్పీ స్కూల్ కు తృతీయ బహుమతి అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఈవో రమేశ్, మెదక్ డీఎస్పీ సైదులు, సైబర్ కాంగ్రెస్ నోడల్ అధికారి జ్యోతి పాల్గొన్నారు.