సంగారెడ్డి ఆగస్టు 11(నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ కృషి తో సంగారెడ్డి జిల్లా ప్రజల చిరకాల కల నెరవేరనుంది. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ త్వరలో ప్రారంభం కానున్నది. మెడికల్ కాలేజీ ప్రారంభానికి అవసరమైన అనుమతులను నేషనల్ మెడికల్ కౌన్సిల్ గురువారం మంజూరు చేసింది. 150 మెడికల్ సీట్ల ప్రవేశానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రాథమిక అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో సెప్టెంబర్ నుంచి మెడికల్ కాలేజీలో తరగతులు ప్రారంభమ య్యే అవకాశాలున్నాయి. సంగారెడ్డి జిల్లా ప్రజలు ఎంతోకాలంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రజల కోరిక మేరకు సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారు.
జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఉత్తర్వులు జారీ చేయటంతోపాటు నిధులు కేటాయించింది. జిల్లా కేంద్ర దవాఖాన సమీపంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. దీంతో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శరవేగంగా ఏర్పాట్లు జరిగాయి.
కళాశాలకు నూతన భవనాన్ని నిర్మించారు. విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, డెమో గదులు, ల్యాబ్లు, లెక్చ రర్ హాల్, లైబ్రరీ, ఫ్యాకల్టీ రూమ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పలుమార్లు వైద్య కళాశాలను సందర్శించి పనులను వేగవంతం చేయాలని వైద్యాధికారులను ఆదేశించడంతో మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సంగారెడ్డిలోని 350 పడకల జిల్లా కేంద్ర దవాఖానను బోధన దవాఖానగా మార్చింది.
మెడికల్ కాలేజీకి అవసరమైన బోధనా సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. మెడికల్ కాలేజీ 8 విభాగాలకు బోధన సిబ్బందితోపాటు కాలేజీకి అనుబంధంగా 14 డిపార్టుమెంట్లకు అవసరమైన వైద్యులను ప్రభుత్వం కేటాయించింది. మెడికల్ విద్యా బోధనకు 27 మంది ప్రొఫెసర్లు, 40 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 12 మంది కాంట్రాక్టు ఫ్యాకల్టీ, 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 35 మంది ఇతర సిబ్బందిని కేటాయించారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ విభాగాలైన ప్లాస్టిక్ సర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో, న్యూరాలజీ విభాగాలకు అదనంగా నలుగురు ప్రొఫెసర్లను ప్రభుత్వం కేటాయించింది
మెడికల్ కాలేజీకి అవసరమైన ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కాలేజీ ప్రారంభానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాల్సిందిగా నేషనల్ మెడికల్ కాలేజీని కోరిం ది. దీంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు ఈ ఏడాది ఫిబ్రవరి 8, 9 తేదీల్లో సంగారెడ్డి మెడికల్ కాలేజీని సందర్శించారు. కాలేజీ భవనంతోపాటు మౌలికవసతులను పరిశీలించటంతోపాటు బోధనాసుపత్రిని సందర్శించారు. తాజా సం గారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభానికి అనుమతులిచ్చారు.
కళాశాలలో 150 మెడికల్ సీట్లకు అనుమతులు ఇచ్చింది. దీంతో త్వరలోనే మెడికల్ తరగతులు ప్రారంభం కానున్నా యి. 2022-23 సంవత్సరానికి సంబంధించిన నీట్ ఫలితా లు త్వరలో వెల్లడికానున్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి సంగారెడ్డి మెడికల్ కాలేజీలో 150 విద్యార్థులను చేర్చుకుంటారు. వచ్చే సెప్టెంబర్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. సంగారెడ్డి మెడికల్ కాలేజీకి అనుమతులు లభించడంపై ప్రిన్సిపాల్ డాక్టర్ వాణి హర్షం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ 150 సీట్లు కేటాయిస్తూ అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ కృషితోనే సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటైనట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి కాలేజీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు మంజూరు చేయటంపై హర్షం వ్యక్తం చేశా రు. సంగారెడ్డి మెడికల్ కాలేజీలో 150 సీట్ల ప్రవేశానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు ఇవ్వడంతో తెలంగాణ విద్యార్థులకు మంచి అవకాశం లభించినట్లు పేర్కొ న్నారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అనుమతులు లభించటంపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చొర వతో సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటైనట్లు చెప్పారు.