ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకున్నది. ఈ మేరకు ఉత్తర్వులను జారీచేయడంతో గురువారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీలో ఇచ్చిన వాగ్ధానాన్ని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగాఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావులకు ఫీల్డ్ అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలిపారు.