ఆగస్టు 11 : బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు విశ్వసించరని, అబద్ధ్దాలు, ఫేక్ ప్రచారాలకు కేరాఫ్ బీజేపీ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో మండలంలోని రాజగోపాల్పేట గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని చెప్పారు. మన పథకాలు కాపీ కొట్టి, మేమే చేశామని అబద్ధాలు ఆడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు పగటి కలులు కం టున్నారని, కాంగ్రెస్ కనుమరుగైన పార్టీ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. స్వరాష్ట్రంలో సిద్దిపేట ఆదర్శ నియోజకవర్గంగా నిలించిందన్నారు.
సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధిని చూసి రాజగోపాల్పేటకు చెందిన బీజేపీ మహిళా మోర్చా గ్రామ శాఖ అధ్యక్షురాలు నాంపల్లి కనకవ్వ, టీఎన్ఎస్ఎఫ్ మం డల అధ్యక్షుడు శ్రావణ్కుమార్, బీజేపీ మండల కార్యదర్శి గణేశ్, శివరాత్రి బాబు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంగౌడ్, సీనియర్ నాయకులు వెంకట్రెడ్డి, మల్లయ్య, షరీఫ్, మాజీ ఏఎంసీ చైర్మన్ సోమిరెడ్డి, సర్పంచ్ రాజేంద్ర, ఎంపీటీసీ సుమలత, పీఏసీఎస్ చైర్మన్లు రమేశ్గౌడ్, మహిపాల్రెడ్డి, మాజీ సర్పంచ్ సత్యం, గ్రామశాఖ అధ్యక్షుడు మల్లేశం పాల్గొన్నారు.