సిద్దిపేట అర్బన్, ఆగస్టు 11 : సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించేందుకే సైబర్ కాంగ్రెస్ను ఏర్పాటు చేసినట్లు సీపీ శ్వేత తెలిపారు. గురువారం పట్టణంలోని వి పంచి కళానిలయంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణ పో లీస్, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించిన ‘సైబర్ కాం గ్రెస్ గ్రాండ్ ఫినాలే’ కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా సైబర్ నేరాలు ఎలా అరికట్టాలో సైబర్ అంబాసిడర్లు, సిద్దిపేట కళాబృందం సభ్యు లు నాటకం ద్వారా ప్రదర్శించారు.
మహిళలు, బాలికల రక్షణ, చట్టాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై షీ టీం అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ జూన్ 2021లో ఉమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ కాంగ్రెస్ను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలల నుంచి 100 మంది సైబర్ అంబాసిడర్లను తయారు చేసేందుకు విద్యార్థులను ఎంపిక చేసి ఆన్లైన్ ద్వారా ఐదు సెషన్ల్లో సైబర్ నేరాల గురించి పూర్తి అవగాహన కల్పించినట్లు తెలిపారు. తోటి విద్యార్థులు, తల్లిదండ్రులకు సైబ ర్ నేరాలపై అవగాహన కల్పించే అవకాశం ఉందని తెలిపారు.
మానవ మనుగడకు టెక్నాలజీ ఎంతో ముఖ్యమ ని, కానీ టెక్నాలజీతో లాభం, నష్టం రెండూ ఉంటాయ ని, మంచి, చెడు అనేవి మనిషి విచక్షణపై ఆధారపడి ఉంటాయన్నారు. సైబర్ అంబాసిడర్లు మరింత ఆశయాలతో ముందుకు వెళ్లి ప్రజలు, తోటి మిత్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలు ఎ ల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విద్యాశా ఖ, ఉమెన్ సెఫ్టీ తెలంగాణ పోలీస్ వారి సహకారంతో మరింత మంది సైబర్ అంబాసిడర్లను తయారు చేయడానికి ప్రతిఒక్కరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ సందర్భంగా సైబర్ కాంగ్రెస్ నో డల్ అధికారి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ మా ట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించామన్నారు. 33 జిల్లా లో 1650 ప్రభుత్వ పాఠశాలల నుంచి 3,300 మంది పిల్లలను సెఫ్టీ అంబాసిడర్లుగా మార్చడానికి మహిళా భ ద్రతా విభాగం, రాష్ట్ర పోలీస్ విభాగం సైబర్ 3 కాంగ్రెస్ అనే పేరుతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ను ప్రారంభించిందన్నా రు.
అనంతరం సిద్దిపేట షీటీమ్ అధికారులను, సిబ్బందిని సన్మానించడంతో పాటు అప్రిసియేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. సైబర్ అంబాసిడర్లుగా ఉత్తమ సేవలు అం దించిన ముగ్గురు విద్యార్థులకు దేవనూరి లిఖిత (మొదటి), నియత లోకేశ్శ(రెండో), స్పందన(మూడో)కు సీపీ శ్వేత మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్రెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సైదా, 50 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.