హవేళీఘనపూర్, మే 27 : పిల్లలు కోరిన కోరికలను వెం టనే తీర్చాలనే తపన ఇటీవల తల్లిదండ్రుల్లో విపరీతంగా పెరి గినది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలతోపాటు కార్లను పిల్లల కు కానుకగా ఇవ్వడం సాధారణంగా మారినది. డ్రైవింగ్పై పూర్తి పట్టు సాధించక ముందే వాహనాలను మైనర్లు నడుపు తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాలపై అతివేగంగా వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇటీవలే కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన కుమార్ అనే యువకుడు పోచారం డ్యామ్ వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలు నిత్యం ఏదో ఒకచోట జరు గుతున్నాయి.
అనేక మంది పిల్లలు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నా తల్లిదండ్రుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదని స్పష్టమవుతోంది. పిల్లలు భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదగాలని, వారు ఏదీ అడిగితే అది కొనిస్తున్నారు. ముఖ్యం గా యువకులు బైక్లపై మోజు చూపుతున్నారు. పాఠశాల దశ నుంచే పిల్లలు ద్విచక్ర వాహనాలపై బడులకు వస్తున్నా రు. పిల్లల కోరికలను తీరుస్తున్న తల్లిదండ్రులు వారి భద్రత ను మరిపోతున్నారు. విద్యార్థులు మైనర్ దశలో వాహనాల ను నడపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు.
ఎదురుగా వచ్చేవారు వాహనదారుల సైతం ప్రమాదాలకు గురవుతున్నారు. 18 ఏళ్లు నిండని యువకులకు వాహనాలను ఇవొ ద్దని తల్లిదండ్రులకు పోలీసు అధికారులు సూచిస్తున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేయడమే పెద్ద తప్పు కాగా, వాహనాలు నడుపుతూ సెల్ఫోన్లు మాట్లాడడం, ఫోన్లు మాట్లాడుతూ వేగంగా వెళ్లి అదుపుతప్పి పడిపోయి గాయాల పాలైన ఘటన లు కూడా ఎన్నో ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు తమ పిల్లలకు ద్విచక్ర వాహనాన్ని ఇవ్వకూడదని పోలీసులు సూచిస్తున్నారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ రోడ్డు నిబంధనలను వివరిస్తున్నారు. పిల్లలు ప్రమాదాలకు గురైతే తల్లిదండ్రుల బతుకు ప్రశ్నార్థకమే.
మైనర్లకు వాహనాలను ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తాం. డ్రైవింగ్పై అవగాహన లేకపోవడంతో ద్విచక్ర వాహనాలపై అతివేగంగా వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్నిసార్లు ప్రాణా లను సైతం కోల్పోతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు. వాహనాలను ఇస్తే తల్లిదం డ్రులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం.
– ఎస్సై మురళి, హవేళీఘనపూర్