చేగుంట/ పెద్దశంకరంపేట, మే 27 : వచ్చేనెల జూన్ 3వ తేదీ నుంచి 5వ విడుత ప్రారంభం కానున్న ప్రల్లె ప్రగతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేగుంట జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్ కోరారు. చేగుంట మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఉమాదేవి అధ్యక్షతన శుక్రవారం వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులతో పల్లె ప్రగతి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే నెల 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమంలో పచ్చదనం, పరిశుభ్రత, ఇతర కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఏపీవో సంతోశ్, ఏఈలు మమత, బాల్రంగం, వెంకటేశ్, కార్యదర్శులు పాల్గొన్నారు.
జూన్ 3వ తేదీ నుంచి ప్రారంభించనున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామాల్లో జయప్రదం చేయాలని మెదక్ డీఎల్పీవో శంకర్నాయక్ అన్నారు. పెద్దశంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, అధికారులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. పల్లె ప్రగతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు.
చీలపల్లి గ్రామంలో వైకుంఠధా మం నిర్మాణ సమస్యపై సర్పంచ్తో చర్చించి, త్వరగా వైకుంఠధామం నిర్మాణ పనులను ప్రారంభించాలని సూచించారు. పెద్దశంకరంపేటలోని నర్సరీని సందర్శించి సూచనలిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ సత్యనారాయణ, సూపరింటెండెంట్ షాకీర్, కార్యదర్శులు ఉన్నారు.నేడు పల్లె ప్రగతిపై సమీక్షకొల్చారం ఎంపీపీ కార్యాలయంలో శనివారం పల్లె ప్రగతిపై సమీక్ష ఉంటుందని ఎంపీడీవో ప్రవీణ్కుమార్ తెలిపారు.