సిద్దిపేట అర్బన్, ఆగస్టు 4 : దేశంలో మైనార్టీ బాలికలు ఎక్కువగా చదువుకునే రాష్ట్రం తెలంగాణే అని, సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమైందని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలోని తెలంగాణ మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలలను గురువారం ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్తో కలిసి మంత్రి హరీశ్రావు సందర్శించారు. ఈ మేరకు విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
విద్యాబోధన, భోజనం, వసతులు ఎలా ఉన్నా యో ఆరాతీశారు. పుస్తకాలు ఆలస్యమవుతున్నాయని విద్యార్థినులు చెప్పగా, వెంటనే అందించాలని అడిషనల్ కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రైవేటు భవనంలో మైనార్టీ పాఠశాల ఉన్న దృష్ట్యా త్వరలోనే శాశ్వత నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.
పాఠశాలలో ఏ సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలు రెసిడెన్షియల్ పాఠశాలలను అపుడప్పుడు సందర్శించాలని చెప్పారు. విద్యార్థినులు బాగా చదువుకొని భవిష్యత్లో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు పాల్గొన్నారు.