దినదినాభివృద్ధి చెందుతున్న చేర్యాల పట్టణంలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్నది. తద్వారా అటు రైతులు, విక్రయదారులు.. ఇటు కొనుగోలుదారు లకు సౌకర్యంగా మారనున్నది. ప్రస్తుతం పట్టణంలో రోడ్లపై విక్రయాలు సాగుతున్నాయి. మంగళవారం సాగే అంగడి సైతం రోడ్డుమీద సాగుతుండడంతో ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.వీటన్నింటికీ పరిష్కారం చూపేందుకు రూ.3 కోట్లతో అత్యాధునికంగా మార్కెట్ నిర్మాణానికి ఇటీవల మంత్రి హరీశ్రావు భూమిపూజ చేశారు. ఈ మార్కెట్లో కూరగాయల నుంచి మొదలుకొని మాంసం, ఇతర సరుకులు అన్నీ ఒక్కచోటే లభ్యం కానున్నాయి.
గ్రామ పంచాయతీ నుంచి బల్దియాగా మారిన చేర్యాల పట్టణాభివృద్ధికి టీఆర్ఎస్ సర్కారు ఎంతో కృషిచేస్తున్నది. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నది. మౌలిక వసతులు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నది. పట్టణంలో ఆధునిక వసతులతో వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇటీవల మంత్రి హరీశ్రావు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే కూరగాయల నుంచి మొదలు కొని మాంసం, ఇతర సరుకులు అన్ని ఒక్కచోట లభ్యమవుతాయి. అంతేకాకుండా పట్టణంలో రోడ్ల మీద సాగుతున్న అంగడితో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కానున్నది.
చేర్యాల, మే 26: పంచాయతీ నుంచి మున్సిపల్ స్థాయికి ఎదిగిన చేర్యాల దినదినాభివృద్ధి చెందుతున్నది. చేర్యాల పట్టణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ భారీగా నిధులు మంజూరు చేస్తున్నారు. చేర్యాలలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. రూ.3 కోట్ల వ్యయంతో ఆధునిక వసతులతో దీనిని నిర్మించనున్నారు. చేర్యాల గ్రామ పంచాయతీ (ఇప్పుడు మున్సిపాలిటీ), అంగడి బజారు, ఎస్బీఐ వద్ద సిద్దిపేట, జనగామ ప్రధాన రహదారిపై దశాబ్దాలుగా అంగడి కొనసాగుతున్నది.
రోడ్లపై ప్రతి మంగళవారం కొనసాగే అంగడి, ప్రస్తుతం రేకుల షెడ్లలో కొనసాగుతున్న కూరగాయల షాప్లు, మున్సిపాలి టీకి ఇరువైపులా ఉన్న షాప్లు, చికెన్, మటన్ షాప్లన్నీ కొత్తగా నిర్మిస్తున్న వెజ్, నాన్వెజ్ మార్కెట్లోకి మారను న్నాయి. ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక శ్రద్ధ, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కృషితో చేర్యాల పట్టణంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి సర్కారు రూ. 3కోట్ల నిధులు మంజూర య్యాయి.
చేర్యాల పట్టణంలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ అందు బాటులోకి వస్తే విక్రయదారులు, వినియోగదారులకు సౌక ర్యంగా మారుతుంది. ప్రస్తుతం రోడ్లపైన కూరగాయల విక్ర యాలు, అంగడి సాగుతుండడంతో ట్రాఫిక్ సమస్యలు తలె త్తుతున్నాయి. నియోజకవర్గంలో పెద్ద సంతల్లో చేర్యాల పట్ట ణంలో నిర్వహించేది పెద్దది. ఈ అంగడికి చేర్యాల, కొము రవెల్లి మండలంలోని 25 గ్రామాలు, మద్దూరు మండలం లోని 15 గ్రామాలు, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లోని 10 గ్రామాల, నంగునూరు మండలంలోని ఖానా పూర్, అంక్షాపూర్, కొండపాక మండలంలోని వెలికట్టే, తిమ్మారెడ్డిపల్లి తదితర గ్రామాల ప్రజల వివిధ వస్తువులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ప్రతివారం వందల సంఖ్యలో పట్టణానికి వస్తారు.
దీంతో పాటు నిత్యం వందల సంఖ్యలో పట్టణ, గ్రామాల ప్రజలు పట్టణంలోని జీపీ షాప్ ల్లో కూరగాయలు కొనుగోలు చేస్తారు.అంగడిలో కూరగా యలు, బట్టలు, మటన్, చికెన్, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, పండ్లు, పసుపు, చేపల విక్రయాలు కొనసాగుతాయి. ఆధు నిక వసతులతో నిర్మిస్తున్న వెజ్, నాన్వెజ్ మార్కెట్ అందు బాటులోకి వస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది.
వెజ్, నాన్వెజ్ భవన నిర్మాణం కోసం సేకరిస్తున్న స్ధలంలో తొలిగింపు పనులు ఇటీవల చేపట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధికారుల ద్వారా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇటీ వల పాత భవనాల తొలిగింపు పనులను పరిశీలించారు. ఆధునిక వసతులతో వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మించేందుకు అనువైన స్ధలం లేకపోవడంతో మున్సిపాలిటీ భవ నంతో పాటు పక్కనే ఉన్న మున్సిపల్ షాప్లు, కూరగాయల షాప్లు, చికెన్, మటన్ దుకాణాలను తొలిగించేందుకు మున్సిపల్ తీర్మానం చేసింది.
ఇటీవల మంత్రి హరీశ్రావు శంకుస్ధాపన చేయడంతో మున్సిపల్ భవనంతో పాటు అంగడి బజారులో మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని పాత దుకాణాల సముదాయాలు, కూరగాయల షాప్ల తొలిగింపు ప్రక్రియ పనులు ప్రారంభించారు. స్ధలం సరిపోయే పరిస్ధితి లేకపోవడంతో 52 ఏండ్ల క్రితం నిర్మించిన వాటర్ ట్యాంకును సైతం తొలి గిస్తున్నారు. భవనాల తొలిగింపు ప్రక్రియ పూర్తికాగా, సంబంధిత శాఖ అధికారులు మార్కింగ్ ఇవ్వడంతో పనులు ప్రారంభం కానున్నాయి.
చేర్యాలలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణంతో సమస్యలు తీరనున్నాయి. రైతులు స్ధానిక జీపీ పక్కన, ఎస్బీహెచ్, షాదీఖానా, మటన్, చికెన్ షాప్ల ముందు దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయాలు కొనసాగిస్తున్నారు. వందలాది మంది వచ్చే మార్కెట్లో వాహనాల పార్కింగ్ లేకపోవ డంతో పట్టణంలోని ప్రధాన రహదారిపైనే ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. మార్కెట్కు వచ్చే వారికి తాగునీటి వసతి లేకపోవడంతో వారు నీటి కోసం ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు.
వర్ష్షాకాలంలో ఇక కూరగాయలు నీటిలో తేలిపోవడం, కొట్టుకుపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. సిద్దిపేట-జనగామ ప్రధాన రహదారిలో పలువురు కూరగాయల విక్రయ దారులు దుకాణాలు ఏర్పా టు చేసుకుని రాత్రి పొద్దు పోయే వరకు తమ వ్యాపా రాన్ని కొనసాగిస్తున్నారు. అంగడి కొనసాగిన రోజున భారీగా ట్రాఫిక్ జామ్ కావ డంతో ప్రయాణికులతో పాటు వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.