ఝరాసంగం,జూలై 3: ఎనిమిదో విడుత హరితహారానికి ఊరూరా మొక్కలు నాటేందుకు నర్సరీల్లో పలు రకాల మొక్క లు సిద్ధంగా ఉన్నాయి. ఝరాసంగం మండలంలోని అన్ని గ్రామాల్లో 3.96 లక్షల మొక్కలు పెంచుతున్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకే ప్రభుత్వం ఏటా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈనర్సరీల్లో టేకు మొక్కలతో పాటు అల్లనేరడి, నీలగిరి, వేప, జామ, చింత, కానుగ చెట్లు పెంచుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం ద్వారా ఊరూరా, వ్యవసాయ పొలాలు, చెరువు గట్లపై మొక్కల నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. నర్సరీలో ఉన్న మొక్కలు తీసుకెళ్లి చెరువు గట్లు, వ్యవసాయ పొలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, శిఖం భూములు, ప్రభుత్వ ఖాళీ స్థలంలో నాటించి పచ్చదనంతో అహ్లదకరంగా మార్చేందుకు ఇప్పటికే ఈజీఎస్, పంచాయితీ కార్యదర్శులు కృషి చేస్తున్నా రు. నర్సరీలో మొక్కలు పెంచుతూ రైతులకు ఉచితంగా పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. వానకాలంలో ఊరూరా ఉచితంగా మొక్కలు పంపిణీ చేసేందుకు ఉపాధి హామీ అధికారులు ప్ర త్యేక శ్రద్ధ వహిస్తున్నారు. గత ఏడాది నాటిన మొక్కలే నేడు ప్రకృతి రమణీయంగా మారింది.
మనూరు, జూలై 3: హరితహారం కార్యక్రమం ద్వారా మండల పరిధిలోని పలు గ్రామాలల్లో మొక్కలు పెంచేందుకు అధికారలు సిద్ధమతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేసింది. ఈ నర్సిరీల్లో మండల పరిధిలోని ప్రత్యేకించి నిమ్మ, కానుగా, టేకు, ఉసిరి, జామతో పాటు పలు రకాల పూల మొక్కలను పెంచుతున్నారు. గతంలో రైతులకు ఇష్టమయ్యే పలు రకాల పండ్ల మొక్కలను వేరే ప్రాంతం నుంచి తెప్పించే ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా మండల కేంద్రంలోని నర్సరీతో పాటు బెల్లాపూర్, పుల్కుర్తి, ఎల్గొయి, బాదల్గావ్, మాయికోడ్, ధన్వార్ తదితర గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరిగాయి. ఏపుగా పెరిన మొక్కలు గ్రామాలకు పల్లె ప్రధాన రోడ్లకు ఇరు పక్కలా నాటుతూ ప్రత్యేక ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు.
గ్రామాల్లోని పలు కాలనీలతో పాటు రోడ్లకు ఇరు పక్కల నాటిన మొక్కలకు ప్రత్యేకించి నీరు పోసేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ మంజూరు చేసిం ది. వీటి ద్వారా నీటిని సరఫరా చేస్తు మొక్కలను పెంచుతున్నారు.
ఊరూరా మొక్కలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మాచునూర్, కృష్ణపూర్, బర్ధిపూర్, సిద్దాపూర్, ఈదులపల్లి నర్సరీల్లో వివిధ రకాల మొ క్కలు పెంచుతున్నారు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల ద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
-రాజ్కుమార్, ఏపీవో (ఝరాసంగం)
మండల పరిధిలోని ప్రతి గ్రామంలో నర్సరీలు ఉన్నాయి. ఈ నర్సరీల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని రకాల మొక్కలు పెంచేలా చూస్తున్నాము. ఒక్కో గ్రామంలోని నర్సరీల్లో మొక్కలు అధికంగా పెరిగాయి. నాటిన ప్రతి మొక్కకు ట్రీ గార్డులను ఏర్పాటు చేసేలా చూస్తున్నాము. ఇందుకు ఆయా గ్రామాల సర్పంచుల సహకారం ఉంది.
షాజిలొద్దీన్, ఎంపీడీవో, మనూరు