హత్నూర, జూలై 3: చెక్డ్యామ్ల నిర్మాణాలతో బీడుభూములు సస్యశ్యామలంగా మారుతున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పన్యాల శివారులో మంజీరా నదిపై రూ.5 కోట్ల 8లక్షలతో నిర్మించిన చెక్డ్యాంపై ఆదివారం ఆయన పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రాజెక్టులు, చెక్డ్యాంల నిర్మాణాలు చేపట్టడంతో జలకళను సంతరించుకుంటున్నాయని, భూగర్భ జలాలు పెంపొంది బోరుబావుల్లో పుష్కలంగా నీరు లభిస్తున్నదన్నారు.
మండలంలో నాలుగు చెక్డ్యామ్లు మంజూరు చేయగా, ఒకటి పూర్తికాగా, మిగతా చెక్డ్యాంల పనులు జరుగుతున్నట్లు తెలిపారు. పన్యాల శివారులో పూర్తైన చెక్డ్యాంతో తొమ్మిది కిలోమీటర్లమేరకు నీరు నిలుస్తుందని, సమీప పంటపొలాలు సస్యశ్యామలం కానున్నట్లు తెలిపారు. అనంతరం లింగాపూర్ గ్రామానికిచెందిన కర్రొల్ల శ్రీలతకు మంజూరైన టీఆర్ఎస్ సభ్యత్వ బీమా చెక్కును అందజేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ ఆంజనేయులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, యువత అధ్యక్షుడు కిశోర్, సర్పంచ్లు శ్వేతాబుచ్చిరెడ్డి, వీరస్వామిగౌడ్, డీఈలు మల్లయ్య, నాగరాజు, ఏఈ నర్సింలు, నాయకులు దుర్గారెడ్డి, విఠల్రెడ్డి, నరేందర్, నవీన్గౌడ్, అశోక్వర్ధన్రెడ్డి, రాజు, కృష్ణగౌడ్, అజ్జు, వెంకట్రామ్రెడ్డి, పెంటేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.