కొల్చారం/రామాయంపేట, జూలై 3 : ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి, మోసం చేసిన బీజేపీని వచ్చే ఎన్నికల్లో భభూస్థాపితం చేస్తామని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్ర ప్రభాకర్ మాదిగ హెచ్చరించారు. పోలీసులు ఎమ్మార్పీస్ నా యకులను ముందస్తుగా అరెస్టు చేసి, పొలీస్స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై మోసం చేసిన బీజేపీ నాయకులు తెలంగాణలో అడుగుపెట్టే నైతికహక్కు లేదని, అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కుతోనే బీజేపీ ఓడిస్తామన్నారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్గారి కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు బంగరిగల్ల దుర్గయ్య, ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు మహేశ్, ఎమ్మార్పీఎస్ నేత సుల్తానగారి నవీన్, దళిత సంఘాల నాయకులు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్యాల కిషన్, నా యకులు పాతూరి రాజు, నర్సింహులు, మైసయ్య డిమాండ్ చేశారు. రామాయంపేట పోలీస్స్టేషన్లో వారు మాట్లాడారు.
వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడుతామని మా టిచ్చి బీజేపీ మాట తప్పిందన్నారు. మోదీ ప్రభుత్వం పెత్తందార్లకే కొమ్ము కాస్తున్నదని విమర్శించారు. వర్గీకరణ బిల్లుపై బీజేపీ తెలంగాణ నాయకులు ప్రధానిని మోదీని ప్రశ్నించాల ని సూచించారు. మాటతప్పిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో దళితుల సత్తా చాటి, గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.