రామాయంపేట, జూలై 3 : పల్లె ప్రగతితోపాటు నిత్యం పారిశుధ్య పనులు చేపట్టడంతో సుతారిపల్లి తన పేరును సా ర్థకం చేసుకున్నది. పేరులోనే సుతారం ఉన్నది.. గ్రామంలో నిత్యం చేపడుతున్న స్వచ్ఛత పనులతో సుతారిపల్లి ఇతర గ్రా మాలకు ఆదర్శంగా మారుతున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు లక్ష్యంగా పంచాయతీ పాలకవర్గం కృషి చేస్తున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్లో సూచించిన పనులను నిత్యం చేపడుతున్నారు. పంచాయతీ పాలకవర్గం చేస్తున్న కృషికి గ్రామస్తులు పూర్తిగా సహకరిస్తున్నారు.
సర్పంచ్, కార్యదర్శి వార్డు సభ్యులతో కలిసి వీధుల్లో పర్యటిస్తూ గ్రామ సమస్యలను పరిష్కరిస్తు న్నారు. నిత్యం వీధులతోపాటు పాఠశాల, గ్రామపంచా య తీ ఆవరణాను అద్దం మాదిరిగా తీర్చిద్దుతున్నారు. హరి త హారంలో భాగంగా ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. మొక్కలను సంరక్షిస్తూ పచ్చనివనంగా మార్చుతున్నారు. సీజనల్ వ్యాధులు విస్తరించకుండా పారి శుధ్యం, శుభ్రత పనులు చేపడుతున్నారు. ప్రధాన రోడ్లు, మురుగునీటి కాల్వలను శుభ్రం చేస్తున్నారు.
ఎక్కడ కూడా చెత్తాచెదారం లేకుండా పరిసరాలను శుభ్రంగా తయారు చేశారు. వచ్చే హరితహారంలో ఇంటింటికీ మొక్కలను అందజేసి హరిత గ్రామంగా మార్చుతామని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామంలో ఇంటింటికీ మరుగు దొడ్లు నిర్మించారు. స్వచ్ఛసర్వేక్షణ్, స్వచ్ఛత అవార్డును కైవసం చేసుకుంటామనిపంచాయతీ పాలకవర్గం సభ్యులు పేర్కొంటున్నారు.
గ్రామస్తుల ఐక్యతతోనే ప్రతి వీధిలో ఎక్కడ కూడా చెత్తాచెదారం లేకుండా చేశాం. ఉదయం వేళ చాటింపు వేయ డంతో గ్రామస్తులు శ్రమదానం కోసం సిద్ధంగా ఉంటారు. సుతారిపల్లిని కచ్చితంగా స్వచ్ఛ సర్వేక్షణ్కు ఎంపికయ్యేలా చేస్తాం. ఇప్పటికే గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నాం.
– పద్మ, సుతారిపల్లి గ్రామ కార్యదర్శి
సుతారిపల్లి గ్రామాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధ్ది చేస్తాం. గ్రామస్తుల ఐక్యత బాగుంది. ఇప్పటికే గ్రామం లో నర్సరీ, పల్లె ప్రకృతివనం, డం పింగ్ యార్డు, వైకుంఠధామం ని ర్మించి, అందుబాటులోకి తెచ్చాం. ప్రతి వీధికి సీసీ రోడ్లు వేశాం. గ్రామంలో ఇతర అభివృద్ధి పనులను చేపట్టాం. సుతారిపల్లికి వచ్చే రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటి స్తాం. హరితహారంలో భాగంగా ఇంటింటికీ మొక్కలను అందజేస్తాం.
– సంధ్య, సుతారిపల్లి గ్రామ సర్పంచ్