పటాన్చెరు, జూన్ 22: పటాన్చెరు మండలాన్ని అభివృద్ధికి మారుపేరుగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండల పరిషత్ సమావేశంలో ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొ ని మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు తమ గ్రామాల్లోని సమస్యలను సభలో ప్రస్తావించారు. వారు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అన్ని శాఖల అధికారులు ఎంపీటీసీలు, సర్పంచ్లు చెప్పిన విషయాలను పరిష్కరించాలని అన్నారు.
ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారని, వారు చెప్పిన పనులు చేస్తేనే వారికి గౌరవం ఉంటుందన్నారు. పటాన్చెరు మండలంలోని ప్రతి గ్రామం ఇప్పుడు అభివృద్ధి పథం లో ఉందన్నారు. శరవేగంగా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ఎంపీటీసీలపై, స ర్పంచ్లపై ఉందన్నారు. అధికారులు సహకరిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఉపాధి హామీ పథకం సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటున్న మొట్టమొదటి నియోజకవర్గం పటాన్చెరు అని ఎమ్మెల్యే అన్నారు. 90 శాతం క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేశామన్నారు.
మండల పరిధిలో 9 అంగన్వాడీలకు రూ. 6 లక్షల చొప్పున కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ముత్తంగి గ్రామ పంచాయతీ భవనాన్ని ఆరునెలల్లో పూర్తి చేయాలని అధికారులతో ఎమ్మెల్యే అన్నారు. పటాన్చెరు బ్లాక్ ఆఫీసు ప్రాంగణంలో వెయ్యిమంది కూర్చునే స్థాయిలో రూ. 16 కోట్లతో ఆడిటోరియం నిర్మిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలుండాలని, ఇప్పుడు కేవలం అభివృద్ధి గురించే చర్చలుండాలని సభ్యులతో ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుప్రజా వెంకట్రెడ్డి, ఎంపీడీవో బ న్సీలాల్, తహసీల్దార్ మహిపాల్రెడ్డి, సర్పంచ్లు ఉపేందర్ ముదిరాజ్, మున్నూరు లక్ష్మయ్య, ఎర్రోళ్ల భాగ్యలక్ష్మి, ఎంపీటీసీలు శ్రీశైలం, అంజిరెడ్డి, నాగజ్యోతి లక్ష్మణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గుమ్మడిదల, జూన్ 22: ఇటీవల గాలివానతో పాడిగేదెలకు విద్యుత్ షాక్ తగిలి మృత్యువాతపడడంతో నిరాశ్రయులైన కు టుంబాన్ని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఓదార్చి రూ.5 లక్షలు ఆర్థిక సాయమందించిన విషయం తెలిసిందే. దోమడుగు గ్రామానికి చెందిన గొంది సంజీవ వద్ద ఐదు పాడిగేదలు ఉం డేవి. కొన్ని రోజుల క్రితం విద్యుత్ తీగలు తెగిపోగా ఐదు పాడి గేదెలు మృత్యువాత పడ్డాయి. స్పందించిన ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి తనవంతు సాయంగా రూ.5 లక్షలు సాయమందించారు.
బాధిత కుటుంబ యాజమాని సంజీవ ఆ నగదుతో మరో 5 గేదెలను కొనుగోలు చేశారు. సర్పంచ్ రాజశేఖర్, ఉపసర్పంచ్ స్వరూపారాంరెడ్డి, టీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడు మురళి, నాయకులు మద్ది శేఖర్రెడ్డి, మంగయ్య, పట్నం లింగం, బొర్రా శ్రీనివాస్రెడ్డి ఆ బర్రెలను వారికి అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా కుటుంబానికి జీవనాధారమైన బర్రెలను తిరిగి పొందడంతో సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పెద్ద మనస్సుతో స్పం దించి సాయమందించారని వారు ధన్యవాదాలు తెలిపారు.