పటాన్చెరు, జూన్ 16: సర్కారు బడులే ఉత్తమమైనవని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలంలోని పాటి, లక్డారం, ఇస్నాపూర్లో నూతనంగా నిర్మించిన సర్కారు బడులను ఎమ్మెల్యే ప్రారంభించారు. రూ. 2.20 కోట్ల ఖర్చుతో ఈ పాఠశాల భవనాలను నిర్మించారు. పటాన్చెరు ఎమ్మెల్యే, పలువురు దాతల అండతో నిర్మాణాలు పూర్తి చేశారు. పాటిలో రూ. 1.10 కోట్ల ఖర్చుతో నిర్మించిన పాఠశాల అందరినీ ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశామన్నారు.
సొంత భవనాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తాయన్నారు. సర్కారు బడుల్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఇం గ్లిష్ మీడియం బోధన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచుతుందన్నారు. సుశిక్షితులైన ఉపాధ్యాయులు సర్కార్ బడుల్లోనే ఉంటారన్నారు. పాటి గ్రామంలో ఏర్పాటు చేసిన యూపీఎస్ పాఠశాల కార్పొరేట్ను మరిపించే స్థాయిలో ఉం దని సర్పంచ్ లక్ష్మయ్యను ఎమ్మెల్యే అభినందించారు. పాటి సర్పంచ్ మున్నూరు లక్ష్మ య్య మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో పాఠశాల నిర్మాణం చేసుకున్నామన్నారు.
పలువురు రియల్ ఎస్టేట్ సంస్థలు ఆర్థికంగా సహకరించడంతో పాఠశాలను చక్కగా నిర్మించుకున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్నా శ్రీనివాస్, సర్పంచ్లు సువర్ణా మాణిక్యరెడ్డి, బాలమణి శ్రీశైలం, తహసీల్దార్ మహిపాల్రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, బీడీఎల్ సీఐ వినాయక్రెడ్డి, ఎంఈవో పాండురంగ రాథోడ్, ఎంపీటీసీలు, నాయకులు దశరథరెడ్డి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
లక్డారం గ్రామ పరిధిలోని నూతన పాఠశాల భవనం ప్రా రంభించిన తరువాత భవనంలో అపరిశుభ్రంగా ఉండటం తో పాటు నాణ్యత లేకపోవడం చూసి కాంట్రాక్టర్పై ఎమ్మె ల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చేలా పనులు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మీ ఇంట్లో గృహ ప్రవేశం ఉంటే ఇలా అపరిశుభ్రంగా ఉంచుకుంటా వా.? అని హెడ్మాస్టర్ను ఎమ్మెల్యే ప్రశ్నించారు.