మెదక్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): వచ్చేనెల 3,4,5 తేదీల్లో నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పల్స్ పోలియో నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 157 ఆరోగ్య ఉపకేంద్రాలు, 1,74,534 నివాస గృహాలు, 25 ట్రాన్సిట్ పాయింట్లు, 176 హైరిస్ కేంద్రాలు, 523 పోలియో బూ త్ కేంద్రాలు, 1046 టీమ్ల ద్వారా 53 రూ ట్లలో 2332 వ్యాక్సినేటర్లతో కార్యక్రమం ని ర్వహించాలని పేర్కొన్నారు. జిల్లాలో 67,962 మంది చిన్నారులు ఉన్నారని, అప్పు డే పుట్టిన పిల్లల నుంచి 5 ఏండ్ల లోపు వయసున్న వారందరికీ పోలియో చుకలు వేయాలని తెలిపారు.
మార్చి 3వ ఆదివారం పోలియో బూత్ కేంద్రాల్లో, మార్చి 4, 5 తేదీల్లో మిగిలిన పిల్లలందరికీ ఇంటింటికీ తిరిగి చుకలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర సర్వలెన్స్ అధికారి డాక్టర్ మురారి రాజేంద్రప్రసాద్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి చందూ నాయక్, జిల్లా విద్యాధికారి రాధాకిషన్, డీడబ్ల్యూవో బ్రహ్మాజీ, జిల్లా యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ నాగరాజు, ఆర్టీసీ డిపో మేనేజర్ సుధ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.