మెదక్ మున్సిపాలిటీ, జనవరి 1: మెదక్ చర్చి సోమవారం భక్తులతో కిటకిటలాడింది. నూతన సంవత్సరం సందర్భంగా వేలాదిగా తరలి వచ్చిన భక్తులు, పర్యాటకులతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది. ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులు పాల్గొన్నారు. అనంతరం చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ శాంతయ్య భక్తులనుద్దేశించి దేవుడి సందేశం వినిపించారు.
ఆదివారం రాత్రి 12 గంటల తరువాత చర్చిలో చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి శాంతయ్య నేతృత్వంలో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు శ్రీనివాస్, డేవిడ్, జైపాల్, సువర్ణలు భక్తులను అశీర్వదించారు. ప్రార్థనల్లో చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, శాంసన్ సందీప్, గెలెన్ చిత్తరంజన్, సువన్ డగ్లస్, జాన్సన్, వికాస్, నోబుల్సన్, జాయ్ముర్రే, సుశీల్, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.