మెదక్ మున్సిపాలిటీ, మార్చి 13 : మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంలో రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్టమైన కర్నాటక నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున్న తరలిరావడంతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగిన ప్రార్థనల్లో భక్తులు పాల్గొని ప్రభువుకు మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా చర్చి ప్రెసీబేటరీ ఇంచార్డీ అండ్రూస్ ప్రేమ్సుమార్ భక్తుల నుద్దేశించేదైవ సందేశం చేశారు.
ప్రార్థనల్లో పాస్టర్లు, దయానంద్, రాజశేఖర్, జైపాల్ చర్చి కమిటీ సభ్యులు రొలండ్పాల్, గెలన్ చిత్తరంజన్, సువన్డగ్లస్, శాంతిమార్ సంశన్సందీప్, ఉదయకిరణ్, సుశీల్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.