మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 20 : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చి భక్తులు, పర్యాటకులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చర్చి ప్రెసీబేటరీ ఇంచార్జీ అండ్రూస్ ప్రేమ్సుకుమార్ భక్తులనుద్దేశించి దైవ సందేశం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు చర్చి ఆవరణలోని చెట్ల కింద వంటవార్పు చేసుకున్నారు.
ప్రార్థనల్లో ఫాస్టర్లు విజయ్కుమార్, పాస్టర్లు జైపాల్, రాజశేఖర్, చర్చి కమిటీ సభ్యులు రోలండ్పాల్, శాంతికుమార్, సువన్ డగ్లస్, సునీల్, సంశన్ సందీప్, ఉదయ్కిరణ్, జాయ్ముర్రే తదితరులు పాల్గొన్నారు.