మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ : మెదక్ చర్చి భక్తులతో కిక్కిరిసి పోయింది. ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగి ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
సండే స్కూల్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరింపజేశాయి. భక్తులనుద్దేశించి చర్చి ప్రేసిబేటరీ ఇంచార్జీ రెవరెండ్ ప్రేమ్సుకుమార్ దైవ సందేశం చేశారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకొని చర్చి మైదానంలో చెట్లకింద వంటావార్పు చేసుకున్నారు.
ఫాస్టర్లు దయానంద్, జైపాల్, వర్జర్, డేవిడ్లు భక్తులను ఆశీర్వదించారు. ప్రార్థనల్లో చర్చి కమిటి సభ్యులు రోలండ్పాల్, సంశాన్ సందీప్, సునీల్, సుశీల్ కుమార్, జాయ్ముర్రే, సువన్డగ్లస్, ఉదయ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు.